అర్ధరాత్రి లాడ్జిలో నటి గొడవ!

Published : Dec 21, 2018, 12:43 PM IST
అర్ధరాత్రి లాడ్జిలో నటి గొడవ!

సారాంశం

కేరళ నటి మంజు సవేక్కార్ అర్ధరాత్రి హోటల్ సిబ్బందితో గొడవకి దిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని శాంత పరిచారు. 

కేరళ నటి మంజు సవార్కర్ అర్ధరాత్రి హోటల్ సిబ్బందితో గొడవకి దిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని శాంత పరిచారు. అసలు విషయంలోకి వస్తే.. నాగర్ కోయిల్ పరిసర ప్రాంతాల్లో ఓ మలయాళ చిత్రం షూటింగ్ జరుగుతోంది.

నటి మంజు సవార్కర్ తో పాటు యూనిట్ సభ్యులందరూ నాగర్ కోయిల్ లో ఓ లాడ్జిలో బస చేస్తున్నారు. బుధవారం రాత్రి  షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చిన యూనిట్ సభ్యులు వారి వారి గదుల్లోకి వెళ్లిపోయారు. తన గదిలోకి వెళ్లిన మంజు మంచంపై దుప్పట్లను హోటల్ సిబ్బంది మార్చకపోవడాన్ని గుర్తించి వారిని ప్రశ్నించింది.

ఈ సమయంలో పెద్ద వివాదం చెలరేగింది. ఒకానొక సమయంలో హోటల్ సిబ్బందిలో ఒకరు ఆమెపై దాడి చేసినట్లు సమాచారం. సిబ్బంది సమాచారంతో అక్కడకి చేరుకున్న పోలీసులు చర్చలు జరపగా.. సదరు నటి తమకు రూ.60 వేల అద్దె చెల్లించాల్సి ఉందని, ఆ విషయాన్ని ప్రశ్నిస్తే తమతో గొడవకి దిగిందని హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పరిస్థితి ఓ కొలిక్కి రావడంతో పోలీసులు అక్కడ నుండి వెళ్లిపోయారు. ఈ విషయంపై నటి మంజు మాట్లాడుతూ.. ''నా గదిని శుభ్రం చేయకపోవడంతో హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తే దానికి వారు నాకు సమాధానం ఇవ్వకుండా నేను అద్దె చెల్లించలేదని గొడవకి దిగారు. నన్ను హేళన చేస్తూ మాట్లాడారు'' అని ఆవేదన వ్యక్తం చేసింది.  

 

PREV
click me!

Recommended Stories

Janhvi Kapoor Home Tour: శ్రీదేవి జ్ఞాపకాలతో జాన్వీ కపూర్ ఇల్లు, 65 కోట్ల ఇంద్ర భవనం చూశారా?
Patriotic Films: నిజ జీవిత హీరోల కథలతో వచ్చిన 5 సినిమాలు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిస్ అవ్వకండి