అలా చేస్తే కరోనా దరిచేరదు అంటున్న మహేష్ వైఫ్ నమ్రత!

By team teluguFirst Published Apr 24, 2021, 7:50 PM IST
Highlights

ప్రతిరోజూ వ్యాయామం చేసేవారికి కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువట. వ్యాయామం చేసే శరీరాన్ని కరోనా త్వరగా అట్టాక్ చేయలేదని ఆమె అంటున్నారు. ఒకవేళ వ్యాయామం చేసేవారికి కరోనా సోకినప్పటికీ, త్వరగా కోలుకుంటారని నమ్రత  తెలియజేశారు. 

మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. వ్యక్తిగత విషయాలతో పాటు, సామాజిక, సినిమా విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పంచుకుంటారు. కాగా కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ ఆ మహమ్మారి నుండి ఎలా బయటపడాలో కొన్ని టిప్స్ ఇచ్చారు. 


ప్రతిరోజూ వ్యాయామం చేసేవారికి కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువట. వ్యాయామం చేసే శరీరాన్ని కరోనా త్వరగా అట్టాక్ చేయలేదని ఆమె అంటున్నారు. ఒకవేళ వ్యాయామం చేసేవారికి కరోనా సోకినప్పటికీ, త్వరగా కోలుకుంటారని నమ్రత  తెలియజేశారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా బాడీకి శ్రమ కల్పించి కరోనా నుండి బయటపడొచ్చని నమ్రత చక్కని చిట్కా పంచుకున్నారు. 


ఇక కరోనా టాలీవుడ్ కు బిగ్ షాక్ ఇస్తుంది. కరోనా కారణంగా అనేక కొత్త చిత్రాల విడుదల ఆగిపోయింది. ప్రభుత్వాలు థియేటర్స్ మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మే నెలలో విడుదల కావాల్సిన ఆచార్య, అఖండ, నారప్ప లతో పాటు ఖిలాడి చిత్రాల విడుదల ఆగిపోయింది. సమ్మర్ లో సినిమా పండగ అనుకుంటే కరోనా మరోమారు కాటేసింది.

click me!