“సర్కారు వారి పాట” లో ఆ మైథిలాజికల్ గెటప్ లో మహేష్?

By Surya PrakashFirst Published Oct 3, 2021, 8:24 AM IST
Highlights

"గీత గోవిందం" చిత్రంతో దర్శకుడిగా మంచి హిట్ కొట్టిన పరశురామ్ తాజాగా ప్రిన్స్ మహేష్ బాబుతో "సర్కార్ వారి పాట" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న "సర్కార్ వారి పాట" చిత్రంలో విలన్ పాత్రలో తమిళ సీనియర్ నటుడు సముద్రఖి చేస్తున్నారు. వీరిద్దరి మధ్యా వచ్చే సీన్ ఇంటర్వెల్ లో హైలెట్ గా ఉండనుంది.

 

 "సరిలేరు నీకెవ్వరు" సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పై ఎక్సపెక్టేషన్స్ రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. అందుకు తగినట్లే డైరక్టర్ సినిమాని ఓ రేంజిలో ప్లాన్ చేసారట. అందుకోసం మాస్ ఎలిమెంట్స్ ని సినిమాలో ఇంక్లూడ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇంటర్వెల్ ని అదిరిపోయేలా  ఫిక్స్ చేసారట. ఇంటర్వెల్ ఎపిసోడ్ లోనే మైథిలాజికల్ గెటప్ లో మహేష్ బాబు కనపడనున్నారట.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్...సింహాచలం గుడి బ్యాక్ గ్రౌండ్ లో వస్తుందిట.వరాహ నరసింహ స్వామి గుడి అది. అక్కడ జరిగే సీన్ లో విలన్ సముద్ర ఖని కు మహేష్ బాబు వరాహ నరసింహ స్వామిలా ఉగ్ర రూపంలో కనిపిస్తారట. అయితే మహేష్ బాబు ఎప్పుడూ మైధలాజికల్ పాత్రను ట్రై చేయలేదు. అందుకు కారణం అతనికి సూట్ అవదని భావించటమే. కానీ డైరక్టర్ చాలా ఇంటిలెంజ్ గా ఆ సీన్ ని తీసినట్లు సమాచారం. ఎలా చేసారన్నది మనం తెరపై చూడాలి.
 
మహేష్ బాబు 27వ సినిమాగా పరశురామ్ దర్శకత్వంలో ఈ 'సర్కారు వారి పాట' మూవీ రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ మహేష్ అభిమానుల్లో బోలెడన్ని అంచనాలు నెలకొల్పాయి. ఆ మధ్యన విడుదలైన మహేష్ బర్త్ డే బ్లాస్టర్ అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. కోలీవుడ్ నటుడు సముథిరఖని ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.  
 

click me!