రమేష్ బాబు కూతురుతో మహేష్ బాబు భార్య నమ్రత పోస్ట్, వైరల్ అవుతున్న ఫోటో

By Mahesh JujjuriFirst Published Nov 29, 2022, 9:30 PM IST
Highlights

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో... మహేష్ బాబు ఫ్యామిలీ అంతా గత కొద్ది కాలంగా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక రీసెంట్ గా నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 

వరుస విషాదాలు మహేష్ బాబు కుటుంబాన్ని కోలుకోనీయకుండా చేశాయి. ఈ ఏడాదిలోనే.. మహష్ బాబు అన్న రమేష్ బాబు.. తల్లి ఇందిరా దేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణం ఆయన్ను కృంగదీసింది. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్తను ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు  వీరాభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. రోజూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యామిలీ. రీసెంట్ గా కృష్ణ  పెద్ద మనవడు.. రమేస్ బాబు కొడుకు ఫోటోలు వైరల్ అవ్వగా... రీసెంట్ గా రమేష్ బాబు కూతురు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

అయితే ఇప్పటి వరకూ మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు ఫ్యామిలీ గురించి చాలా మందికి పెద్దగా తెలియదు కానీ కృష్ణ గారి చిన్న కర్మ అప్పుడు వదిన మృదుల, అన్నయ్య పిల్లలు భారతి, జయకృష్ణలతో మహేష్ కలిసున్న పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అప్పుడు అందరూ ఓ వీళ్ళు రమేష్ బాబు పిల్లలా అని ఆశ్చర్యపోయారు. ఇక రీసెంట్ గా  జరిగిన కృష్ణ గారి పెద్ద కర్మ కార్యక్రమంలో మహేష్ బాబు, సుధీర్ బాబు, తో పాటు కృష్ణ సోదరుడు ఆదిశేష గిరి రావు ఎమోషనల్ అవడంతో అభిమానులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. 

ఇకమహేష్ భార్య నమ్రత రీసెంట్‌గా బావ గారి కుమార్తె భారతి గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ ఇద్దరమ్మాయిల వల్ల ఇంట్లో నవ్వులొచ్చాయి అంటూ.. రమేష్ బాబు కూతురు  భారతి తో పాటు సితారలతో కలిసి తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు నమ్రత. బావ రమేష్ బాబు కూతురి గురించి మహేష్ వైఫ్ ఫస్ట్ టైం పోస్ట్ చేయడంతో ఈ ఫోటో నెట్టింట ట్రెండ్ అవుతోంది. 

రమేష్ బాబుకు కూతురు,కొడుకు ఉండగా.. మహేష్ కు కూడా గౌతమ్,  సితార ఉన్నారు. ఇక సితారతో పాటు భారతి ఫోటోలను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మహాలక్ష్మీలా ముచ్చటగా ఉన్నారు అంటూ మహేష్ ఫ్యాన్స్,  కామెంట్స్ చేస్తున్నారు.

click me!