కాలర్ ఎగరేసి మరీ సినిమా చూశా.. మహేష్ బాబు కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Oct 2, 2018, 4:37 PM IST
Highlights

మణిరత్నం లాంటి దర్శకుడితో సినిమాలు చేయాలని ప్రతి ఒక్క హీరో కలలు కంటుంటాడు. ఆయన ఎంత గొప్ప దర్శకుడనే విషయం అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు మణిరత్నంకి వీరాభిమాని

మణిరత్నం లాంటి దర్శకుడితో సినిమాలు చేయాలని ప్రతి ఒక్క హీరో కలలు కంటుంటాడు. ఆయన ఎంత గొప్ప దర్శకుడనే విషయం అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు మణిరత్నంకి వీరాభిమాని. తాజాగా మణిరత్నం డైరెక్ట్ చేసిన 'చెక్క చివంత వానమ్' సినిమా తెలుగులో 'నవాబ్'పేరుతో అనువాదమైంది.  

ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మణిరత్నం ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన మహేష్ బాబు తనదైన స్టైల్ లో స్పందించారు.

''ఇదొక క్లాసిక్ సినిమా. ఈ దశాబ్దానికి ఇదే గొప్ప సినిమా. ప్రతి ఒక్కరూ అధ్బుతంగా నటించారు. రెహ్మాన్ సంగీతం అధ్బుతం. ఓ మణిరత్నం అభిమానిగా చెప్తున్నాను, చెన్నైలోని థియేటర్లలో ఆయన సినిమాలను చప్పట్లు కొట్టుకుంటూ చూసేవాడిని. ఇప్పుడూ అదే చేశాను. నా హోం థియేటర్‌లో కాలర్ ఎగరేసి మరీ ఈ సినిమాను చూశాను'' అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

click me!