బ్రేకింగ్: కెజిఎఫ్ డైరెక్టర్ తో మహేష్ బాబు..?

By Udaya DFirst Published Mar 8, 2019, 1:40 PM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు 'కెజిఎఫ్' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి పని చేయబోతున్నాడనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు 'కెజిఎఫ్' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి పని చేయబోతున్నాడనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. 'కెజిఎఫ్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ ప్రస్తుతం తన దృష్టి మొత్తం 'కెజిఎఫ్' చాప్టర్ 2 పైనే పెట్టాడు.

ఈ సినిమాను 2020 సమ్మర్ లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ప్రశాంత్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తోన్న కొందరు నిర్మాతలు అతడిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. ప్రశాంత్ మాత్రం 'కెజిఎఫ్' చాప్టర్ 2 పూర్తయిన తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పని చేయాలని అనుకుంటున్నాడు. ఇటీవల నమ్రతని కలిసి ఓ స్టోరీ లైన్ కూడా వినిపించారట. ఈ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇంకా ప్రశాంత్ పూర్తి కథను సిద్ధం చేయలేదు. అంతా సిద్ధమైన తరువాత ఒకసారి మహేష్ ని కలిసి పూర్తి కథను వివరించనున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను మహేష్ బాబు తన సొంత బ్యానర్ లో నిర్మించే అవకాశాలు ఉన్నాయి.  

click me!