మహేష్‌ బాబుకి ఈడీ షాక్‌.. నోటీసులు జారీ ?

Mahesh Babu: టాలీవుడ్‌ స్టార్‌ హీరో, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకి ఈడీ షాకిచ్చింది. ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని వెల్లడించింది. ఇదిప్పుడు టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో లేని మహేష్‌ పై ఇప్పుడు ఈడీ కన్నేయడం కలవరానికి గురి చేస్తుంది. 
 

Mahesh Babu has been issued summons by ED in telugu arj

Mahesh Babu: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చిక్కుల్లో పడ్డారు. ఈడీ(ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌) నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌ కేసుకు సంబంధించి మహేష్‌ బాబుకి ఈడీ సమన్లు జారీ చేయడం గమనార్హం. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని మహేష్‌ బాబుకి ఈడీ నోటీసుల్లో పేర్కొంది. 

సూర్య డెవలపర్స్ నుంచి మహేష్‌ బాబు రూ.5.9 కోట్లు అందుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో రూఐ.3.5కోట్లు నగదుగా తీసుకోగా, 2.5కోట్లు ఆర్‌టీజీఎస్‌ ద్వారా బదిలీ ఉంది. ఈ లిక్విడ్‌గా మనీ తీసుకోవడంపైనే ఈడీ దృష్టిపెట్టినట్టు తెలుస్తుంది. సాయి సూర్య డెవలపర్స్ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీని మహేష్ బాబు ప్రమోట్‌ చేశారు. ఈ క్రమంలో ఆయన భారీగా పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తుంది. 

Latest Videos

ఇదిలా ఉంటే సూరానా గ్రూప్‌, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలు ఒకే భూమిని వేర్వేరు వ్యక్తులకు విక్రయించి మోసాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడం షాకిస్తుంది. ఇందులో మహేష్‌ బాబు కి నోటీసులు జారీ చేయడం మరింత ఆశ్చర్యపరుస్తుంది. 

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. `ఎస్‌ ఎస్‌ ఎంబీ 29` వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తయ్యింది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుందట. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో ఆఫ్రీకన్‌ అడవుల నేపథ్యంలో ప్రపంచ సాహసికుడి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

vuukle one pixel image
click me!