మహేష్‌ బాబుకి ఈడీ షాక్‌.. నోటీసులు జారీ ?

Published : Apr 22, 2025, 08:20 AM ISTUpdated : Apr 22, 2025, 08:34 AM IST
మహేష్‌ బాబుకి ఈడీ షాక్‌.. నోటీసులు జారీ ?

సారాంశం

Mahesh Babu: టాలీవుడ్‌ స్టార్‌ హీరో, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకి ఈడీ షాకిచ్చింది. ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని వెల్లడించింది. ఇదిప్పుడు టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో లేని మహేష్‌ పై ఇప్పుడు ఈడీ కన్నేయడం కలవరానికి గురి చేస్తుంది.   

Mahesh Babu: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చిక్కుల్లో పడ్డారు. ఈడీ(ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌) నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌ కేసుకు సంబంధించి మహేష్‌ బాబుకి ఈడీ సమన్లు జారీ చేయడం గమనార్హం. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని మహేష్‌ బాబుకి ఈడీ నోటీసుల్లో పేర్కొంది. 

సూర్య డెవలపర్స్ నుంచి మహేష్‌ బాబు రూ.5.9 కోట్లు అందుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో రూఐ.3.5కోట్లు నగదుగా తీసుకోగా, 2.5కోట్లు ఆర్‌టీజీఎస్‌ ద్వారా బదిలీ ఉంది. ఈ లిక్విడ్‌గా మనీ తీసుకోవడంపైనే ఈడీ దృష్టిపెట్టినట్టు తెలుస్తుంది. సాయి సూర్య డెవలపర్స్ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీని మహేష్ బాబు ప్రమోట్‌ చేశారు. ఈ క్రమంలో ఆయన భారీగా పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే సూరానా గ్రూప్‌, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలు ఒకే భూమిని వేర్వేరు వ్యక్తులకు విక్రయించి మోసాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడం షాకిస్తుంది. ఇందులో మహేష్‌ బాబు కి నోటీసులు జారీ చేయడం మరింత ఆశ్చర్యపరుస్తుంది. 

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. `ఎస్‌ ఎస్‌ ఎంబీ 29` వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తయ్యింది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుందట. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో ఆఫ్రీకన్‌ అడవుల నేపథ్యంలో ప్రపంచ సాహసికుడి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Duvvada Srinivas: చీరలమ్మి 7 నెలల్లో 12 కోట్లు సంపాదించా, సక్సెస్ అంటే ఇది
Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?