`సైదాబాద్‌ చిన్నారి`పై మహేష్‌ తీవ్ర అసహనం.. దిగజారిపోయామంటూ ఫైర్‌

Published : Sep 14, 2021, 09:07 PM IST
`సైదాబాద్‌ చిన్నారి`పై మహేష్‌ తీవ్ర అసహనం.. దిగజారిపోయామంటూ ఫైర్‌

సారాంశం

సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. మంచు మనోజ్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడుని పట్టుకుని 24గంటల్లో ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు తాజాగా మహేష్‌ బాబు స్పందించారు. వ్యవస్థపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నామని ప్రశ్నించారు.

సైదాబాద్‌, సింగరేణి కాలనీలోని ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచార హత్య ఘటన తెలంగాణ రాష్ట్రాన్ని షేక్‌ చేస్తుంది. ఇప్పటి వరకు నిందితుడు పల్లకొండ రాజు ఆచూకి కోసం పోలీసులు పది బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని పట్టిస్తే పది లక్షల ఇస్తామని పోలీసులు నజరానా ప్రకటించారు. ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా ఇంకా నిందితుడిని పట్టుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నేపథ్యంలో దీనిపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. మంచు మనోజ్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడుని పట్టుకుని 24గంటల్లో ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు తాజాగా మహేష్‌ బాబు స్పందించారు. వ్యవస్థపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నామని ప్రశ్నించారు. ఘటనపై, అధికారులపై మహేష్‌ అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ ద్వారా మండిపడ్డారు.

`సింగరేణి కాలనీలోని ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఘోరమైన నేరం మనం సమాజంగా ఎంతగా దిగజారిపోయామో గుర్తు చేస్తుంది. `మా కుమార్తెలు ఎప్ఉపడైనా సురక్షితంగా ఉంటారా?` అనేది ఎల్లప్పుడూ ఒక ప్రశ్న. సమాజం గగ్గోలు పెడుతుంది. బాధిత కుటుంబం ఎంతటి బాధని అనుభవిస్తుందో ఊహించలేదు. త్వరిత గతిన చర్యని నిర్ధారించి, చిన్నారికి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నా` అని ట్వీట్‌ చేశారు మహేష్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?
Toxic Movie: బయటపడ్డ తెరవెనుక రహస్యం, యష్ టాక్సిక్ మూవీ మేకింగ్ వీడియో వైరల్..