రెజీనా కసాండ్రా ద్విపాత్రాభినయం.. అదరహో అనిపిస్తున్న `నేనే నా?` ట్రైలర్‌

By Aithagoni RajuFirst Published Sep 14, 2021, 6:30 PM IST
Highlights

రెజీనా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రాణిగా, ఆర్కియాలజిస్ట్ గా కనిపించబోతుంది. పీరియడ్‌ కథతో సినిమా సాగుతుందని తెలుస్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. నిధి అగర్వాల్‌, విజయ్‌ సేతుపతి, లింగుస్వామి విడుదల చేశారు.

రెజీనా కసాండ్రా మెయిల్‌ లీడ్‌గా నటిస్తున్న చిత్రం `నేనే నా?`. తెలుగు, తమిళంలో రూపొందుతున్న చిత్రమిది. కార్తీక్‌ రాజు దర్శకత్వం వహించారు. రాజశేఖర్‌ వర్మ తన ఆపిల్‌ ట్రీ స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో రెజీనా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రాణిగా, ఆర్కియాలజిస్ట్ గా కనిపించబోతుంది. పీరియడ్‌ కథతో సినిమా సాగుతుందని తెలుస్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. నిధి అగర్వాల్‌, విజయ్‌ సేతుపతి, లింగుస్వామి విడుదల చేశారు. 

ట్రైలర్‌ చూస్తుంటే ఇది వందేళ్ల క్రితం జరిగిన ఒక భయంకరమైన సంఘటనని ఇప్పుడు చూపించబోతున్నట్టు తెలుస్తుంది. రెజీనా వందేళ్ల క్రితం రాణి అయితే, ఇప్పుడు ఆమె పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఓ మిస్టీరియస్‌ కేసుని ఛేదించబోతున్నట్టు ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతుంది. గతం, ప్రస్తుతం మధ్య లింకులను ఆసక్తికరంగా సాగబోతున్నట్టు, హర్రర్‌ ఎలిమెంట్లు, కామెడీ మేళవింపుగా ఇది సాగుతుందని తెలుస్తుంది. 

సినిమాకి సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు. గోకుల్‌ బెనాయ్‌ సినిమాటోగ్రఫీగా పనిచేస్తున్నారు. రెజీనాతోఆపటు వెన్నెల కిషోర్‌, అక్షర గౌడ, తాగుబోతు రమేష్‌, జయప్రకాష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుందని నిర్మాతలు తెలిపారు.

click me!