సూపర్స్టార్ మహేశ్ 27వ చిత్రం ‘సర్కారువారి పాట’. పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే యు.ఎస్లో చిత్రీకరణ జరుపుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కరోనా టైమ్ లో ఏమాత్రం భయం లేకుండా అమెరికా వెళ్ళడానికి రెడీ అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే నిజమా కాదా అనేది ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ గా మారింది. అయితే అది నిజమే అని ఆయన తాజాగా ట్వీట్ తో ఖరారు చేసారు. మహేష్ హీరోగా నటించనున్న కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ కోసం త్వరలో వీసాలు రెడీ చేసుకుని, ఫ్లయిట్ ఎక్కనున్నారు. ‘గీత గోవిందం’ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.
మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నవంబర్లో అమెరికాలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో అక్కడ మొదటి షెడ్యూల్లో యాక్షన్ సీన్లు, కొంత టాకీ తీయాలని సన్నాహాలు చేశారు. ఈ విషయాన్ని తాజాగా మహేష్ బాబు చేసిన ట్వీట్ ఖరారు చేసింది.
ఆ సినిమా ఫారిన్ కో ఆర్టినేటర్ గోపీ కృష్ణ నర్రావుల గురించి మహేశ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘‘గోపీ కృష్ణ నర్రావులగారికి లైన్ ప్రొడ్యూసర్గా, ఫారిన్ కో ఆర్టినేటర్గా నా ‘సర్కారువారి పాట’ 100వ చిత్రమని తెలిసింది. ఆయన ప్రయాణం 1988లో విడుదలైన ‘బజారురౌడీ’తో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. మా సినీ కుటుంబంలో హార్డ్ వర్కర్, డేడికేషన్ ఉన్న వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఆయన ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. ఆయనకు అభినందనలు. మీ ప్రయాణం ఇంతే గొప్పగా సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మహేశ్.
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తీ సురేష్ కన్ఫార్మ్ అయ్యారు. బ్యాంకు మోసాల బ్యాక్డ్రాప్లో సాగే రివెంజ్ డ్రామాయే ఈ చిత్రం అని, ఓ బ్యాంకు మేనేజర్ కొడుకుగా మహేశ్ పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
సంగీతం తమన్ అందించబోతున్నాడట. అలాగే చాలా కాలం తర్వాత మహేష్ రొమాంటిక్ బాయ్ గా నటించబోతున్నాడు. మహేష్ ను ఒక మ్యాచుర్డ్ లవ్ స్టోరీలో చూపించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో అరవింద స్వామి విలన్ గా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు రానుంది.