సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండడంతో ఈ చిత్రానికి కొంత గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరిగింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండడంతో ఈ చిత్రానికి కొంత గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం అన్నీ సెట్ అయ్యాయి. చిత్ర యూనిట్ అభిమానులని ఉత్సాహపరిచేలా అఫీషియల్ అప్డేట్ ఇచ్చింది.
చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా ట్వీట్ చేసింది. 'అంతులేని ఉత్సాహంతో షూటింగ్ కి వెళ్ళబోతున్నాం. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. షూటింగ్ నాన్ స్టాప్ గా జరగనుంది. మరిన్ని అదిరిపోయే అప్డేట్లు రానున్నాయి అంటూ చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.
ఈ సందర్భంగా త్రివిక్రమ్, మహేష్ బాబు కలసి ఉన్న ఫోటోలని షేర్ చేశారు. వీరితో పాటు నిర్మాతలు చినబాబు, నాగవంశీ, సంగీత దర్శకుడు థమన్ కూడా ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించబోతోంది. త్రివిక్రమ్ మహేష్ కోసం కంప్లీట్ యాక్షన్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సమాచారం.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ కి ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. త్రివిక్రమ్ చివరగా అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో చిత్రం తెరకెక్కించారు.
దర్శకధీరుడు రాజమౌళి చిత్రానికి ముందు మహేష్ నటించబోతున్న చిత్రం ఇది. వీలైనంత త్వరగా త్రివిక్రమ్ చిత్రాన్ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ నుంచి రాజమౌళి చిత్రానికి వర్క్ స్టార్ట్ చేయాలని మహేష్ బాబు భావిస్తున్నాడు. త్రివిక్రమ్ చిత్రంలో మహేష్ విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
All set to shoot! With heightened spirit and great energy will go on sets from January, non-stop! Stay-Tuned, More SUPER-EXCITING updates coming your way soon! 🌟✨
SUPERSTAR pic.twitter.com/cEjRFVsz64