వాళ్లను గాడిదలతో పోలుస్తూ హీరోయిన్ తల్లి కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Dec 8, 2018, 9:22 AM IST
Highlights

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన ప్రియుడు అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నారు. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన ప్రియుడు అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నారు.

అయితే వీరి పెళ్లిపై కొందరు బురద జల్లుతున్న విషయం తెలిసిందే. నిక్ కంటే ప్రియాంక పెద్దది కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ది కట్ అనే దినపత్రిక ప్రియాంకని మాయలాడి అంటూ ఓ కథనం కూడా ప్రచురించింది.

ప్రియాంక అభిమానులు ఈ విషయంపై సీరియస్ అవ్వడంతో కథనాన్ని తొలగించి దినపత్రిక క్షమాపణలు చెప్పింది. తాజాగా ప్రియాంకపై వస్తోన్న విమర్శలపై ఆమె తల్లి మధు చోప్రా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ''నా కూతురు తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమె ప్రస్తుతం చాలా సంతోషంగా ఉంది. కొత్త వధూవరులతో పాటు తమ కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉన్నాం.

ఇలాంటి సమయంలో కొన్ని కథనాలు మమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు. కొంతమంది ఫూల్స్ రాసిన కథనాలను మేం పట్టించుకోం. చెత్త పనులు చేసే గాడిదలు ఉంటాయి. ఆ గాడిదల అరుపులు పట్టించుకోం'' అంటూ మధు చోప్రా అన్నారు. ఇప్పటికే ఈ విషయంపై స్పందించిన ప్రియాంక ఇలాంటి వార్తలను తను పెద్దగా పట్టించుకోనని వెల్లడించింది. 

click me!