అక్కడ రెండేళ్ల తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం.. వకీల్ సాబ్ రికార్డ్ బ్రేక్ చేసిన 'లవ్ స్టోరీ'

By telugu teamFirst Published Sep 23, 2021, 5:05 PM IST
Highlights

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు అంతా సిద్ధం అయింది. శుక్రవారం నుంచి ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు అంతా సిద్ధం అయింది. శుక్రవారం నుంచి ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుంది. చైతు, సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. సున్నితమైన భావోద్వేగాల్ని హైలైట్ చేస్తూ మెప్పించడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు. 

కరోనా పరిస్థితులు, థియేటర్స్ సమస్యలు, టికెట్ల వివాదం కొనసాగుతున్న తరుణంలో విడుదలవుతున్న లవ్ స్టోరీపై ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇదిలా ఉండగా లవ్ స్టోరీ చిత్రం రిలీజ్ కు ముందే రికార్డులు ప్రారంభించింది. చిత్ర యూనిట్ కి ఇది పాజిటివ్ సైన్ అనే చెప్పాలి. 

తెలుగు చిత్రాలు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మంచి వసూళ్లు సాదిస్తుంటాయి. ఓవర్సీస్ లో యూఎస్ మార్కెట్ ప్రధానమైనది అయితే.. యూకేలో కూడా తెలుగు చిత్రాలు విడులవుతుంటాయి.  కరోనా కారణంగా రెండేళ్ల నుంచి తెలుగు సినిమాలేవీ యూకేలో రిలీజ్ కాలేదు. కాగా రెండేళ్ల తర్వాత అక్కడ విడుదలవుతున్న తొలి చిత్రంగా లవ్ స్టోరీ నిలిచింది. 

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని మేకర్స్ 900 పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.  యూఎస్ లో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. యూఎస్ లో ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో లవ్ స్టోరీ చిత్రం 150K డాలర్స్ వాసులు చేసింది. వకీల్ సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో 120k డాలర్స్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో లవ్ స్టోరీ చిత్రం వకీల్ షబ్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. మరి సినిమా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 

click me!