హైదరాబాద్ లో జరుగుతున్న ద్లోబర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమిట్ లో నటి మంచు లక్ష్మీకి ఓ అరుదైన అవకాశం వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్తో కలిసి ఓ సమావేశంలో పాల్గొనే అవకాశం మంచు లక్ష్మీని వరించినట్టు సమాచారం.
హెచ్ఐసీసీలో జరగనున్న ఈ సదస్సులో ఓ ప్యానెల్ మీటింగ్కి హాజరయ్యే భారత ప్రతినిధుల బృందంలో మంచు లక్ష్మీ పేరుని కూడా ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సదస్సులో భాగంగా ఇవాంక ట్రంప్ సమక్షంలో.. జరిగే ఓ సమావేశానికి హాజరై సమావేశంలోని ప్రతినిథులను ఉద్దేశించి ప్రసంగించే గొప్ప అవకాశం ఆమె సొంతమైందని తెలుస్తోంది.
అయితే లక్ష్మీ మంచు ఈ విషయాన్ని మాత్రం ఎక్కడా షేర్ చేసుకోక పోవడంతో ఇందులో ఎంత నిజం వుందనే అంశంపై స్పష్టత రావాల్సి వుంది.