బిగ్ హౌస్ లో కూతురు చేసిన పనికి కెమెరాల ముందు తిట్టేసిన తల్లి!

By team teluguFirst Published Dec 30, 2020, 2:03 PM IST
Highlights

ఓ లేడీ కంటెస్టెంట్స్ ని స్వయంగా తల్లి విమర్శిస్తూ తిట్ల పురాణం అందుకోవడం సంచలనంగా మారింది. బిగ్ బాస్ హౌస్ వేదికగా జరిగిన ఈ సంఘటన, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమిళ బిగ్ బాస్ సీజన్ 4 లో శివాని అనే నటి పాల్గొనడం జరిగింది.

బిగ్ బాస్ హౌస్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఓ లేడీ కంటెస్టెంట్స్ ని స్వయంగా తల్లి విమర్శిస్తూ తిట్ల పురాణం అందుకోవడం సంచలనంగా మారింది. బిగ్ బాస్ హౌస్ వేదికగా జరిగిన ఈ సంఘటన, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమిళ బిగ్ బాస్ సీజన్ 4 లో శివాని అనే నటి పాల్గొనడం జరిగింది. కోలీవుడ్ లో ఈమె కొన్ని చిత్రాలలో నటించడం జరిగింది. హౌస్ లో శివాని ప్రవర్తన పట్ల ప్రేక్షకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ ఫేవరేట్ గా ఉన్న ఆరి అనే అబ్బాయితో ఆమెకు తరచుగా గొడవలు అవుతున్నాయి. 

అలాగే హౌస్ లో ఉన్న బాలాజీ అనే కంటెస్టెంట్ తో ఆమె చాలా సన్నిహితంగా ఉంటున్నారు. బాలాజీ, శివాని రొమాన్స్ కొంచెం శృతిమించగా విమర్శలు ఎక్కువయ్యాయి. కాగా హౌస్ మేట్స్ ని పేరెంట్స్ కలిసే అవకాశం బిగ్ బాస్ నిర్వాహకులు కల్పించారు. దీనితో శివాని తల్లి అఖిల్ హౌస్ లోకి ప్రవేశించడం జరిగింది. తల్లి అఖిలను చూసిన శివాని ఎమోషనల్ అయ్యారు. ఆమె కన్నీరు పెట్టుకోవడం జరిగింది. కాసేపు శివానిని ఓదార్చిన అఖిల్... తిట్ల దండకం అందుకుంది. 

బిగ్ బాస్ హౌస్ లోకి నువ్వు వచ్చింది ఎందుకు.. చేస్తుంది ఏమిటని శివానిపై కోప్పడ్డారు. బిగ్ బాస్ షో మన బంధువులు, మిత్రులు అందరూ చూస్తున్నారు. నీ ప్రవర్తన ఏమీ బాగోలేదు. నీ గేమ్ నువ్వు ఆడక ఇతరుల గురించి నీకు ఎందుకు అన్నారు అఖిల. అంతే కాకుండా... ఆరితో నీకు గొడవలు ఎందుకు, అతను చెప్పింది వినవచ్చు కదా అని అఖిల తిట్టారు. బాలాజీ వెనకాల ఎందుకు తిరుగుతున్నావ్ అంటూ గట్టిగా హెచ్చరించారు. ఇక ఆపు అని శివాని ఎంతలా బ్రతిమిలాడినా కూడా.. అఖిల తగ్గలేదు. హౌస్ లో కెమెరాల సాక్షిగా జరిగిన ఈ ఉదంతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

click me!