రెండు రోజులు నరకం..మాలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దుః పవన్‌ హీరోయిన్‌ కృతి కర్బందా

By Aithagoni RajuFirst Published May 4, 2021, 9:18 AM IST
Highlights

ఇటీవల తమ ఫ్యామిలీ కరోనా బారిన పడిన నేపథ్యంలో మాలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని తెలిపింది నటి కృతి కర్బందా. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేసింది.

`అనవసరంగా ఎవరూ ఇంటి దాటి బయటకు వెళ్లొద్దు. నా సొంత అనుభవంతో చెబుతున్నా. మేం రెండు రోజులు ప్రత్యక్ష నరకం అనుభవించాం` అని చెబుతోంది పవన్‌ హీరోయిన్‌ కృతి కర్బందా. తెలుగులో పవన్‌తో `తీన్‌మార్‌`, రామ్‌చరణ్‌ `బ్రూస్‌లీ`, `ఒంగోలు గిత్త` చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది కృతి కర్బందా. ఇటీవల తమ ఫ్యామిలీ కరోనా బారిన పడిన నేపథ్యంలో మాలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని తెలిపింది. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేసింది.

`గత 48గంటల్లో నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో నరకం అనుభవించాం. మీకు అనుభవమయ్యే వరకు ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదు. కాబట్టి దయజేసి ఇంట్లోనే ఉండండి. మీరు బయటకు వెళ్లాలనుకున్నప్పుడు మీ ప్రాణాన్ని రిస్క్ లో పెడుతున్నారని గ్రహించి వెనకడుగు వేయండి. మీ ప్రాణాలను, జీవితాలను లైట్‌గా తీసుకోకండి` అని కృతి తెలిపింది. దీంతో తమ ఫ్యామిలీ కూడా కరోనాకి గురైనట్టు చెప్పింది కృతి. 

You don’t know how bad it is, till it hits home. The last 48 hours have been beyond painful for my family and myself. Please please please stay indoors. The next time u decide to step out, just take a step back and think if it’s worth risking your life.

— kriti kharbanda (@kriti_official)

ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలతోనే బిజీగా ఉన్న ఈ అమ్మడు చివరగా `హౌజ్‌ఫుల్‌4`, `పాగల్‌పంటి` చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం `వాన్‌`, `14ఫేర్‌` చిత్రాల్లో నటిస్తుంది. పలువురు స్టార్‌ హీరోలు కూడా  కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

click me!