ప్రభాస్‌ పెదనాన్నకి బంపర్‌ ఆఫర్‌.. తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు

Published : Jan 07, 2021, 03:33 PM IST
ప్రభాస్‌ పెదనాన్నకి బంపర్‌ ఆఫర్‌.. తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు

సారాంశం

టాలీవుడ్‌ రెబల్‌ స్టార్‌, బీజేపీ సీనియర్‌ నాయకుడు, పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజుకి బంపర్‌ ఆఫర్‌ వరించింది. ఆయన తామిళనాడు గవర్నర్‌గా ఎంపికైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్‌ రెబల్‌ స్టార్‌, బీజేపీ సీనియర్‌ నాయకుడు, పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజుకి బంపర్‌ ఆఫర్‌ వరించింది. ఆయన తామిళనాడు గవర్నర్‌గా ఎంపికైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కొందరు నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేస్తుండటం విశేషం. 

ఈ వార్తతో ప్రభాస్‌ అభిమానులు, కృష్ణం రాజు అభిమానులు సంబరపడుతున్నారు. కృష్ణంరాజు చాలా కాలంగా బీజీపీలో ఉన్నారు. ఆయన 1998లో కాకినాడ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1999లో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. వివిధ కమిటీల్లో సభ్యుడిగా పని చేశారు. 2000 సంవత్సరంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణం రాజు.. అనంతరం కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత మళ్లీ బీజేపీలో చేరారు. 

ఇప్పుడు తమిళనాడు గవర్నర్‌గా ఎంపిక కావడం విశేషం. అయితే దీనిపై ఆయన్ని సంప్రదించగా, ఇంకా తనకు అధికారిక సమాచారం అందలేదని తెలియజేశారు కృష్ణంరాజు. అయితే గవర్నర్‌ కావాలనేది ఆయన చిరకాల కోరిక. అది నెరవేరబోతుండటం అభినందనీయం. 

ఇక కృష్ణంరాజు తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవ వేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో జన్మించిన కృష్ణంరాజు, 1966లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.  ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ వంటి వారికి సమకాలీకులుగా రాణించారు. అగ్ర నటుడిగా విశేష ప్రేక్షకాదరణ పొందారు. ముఖ్యంగా ఆయన రెబల్‌ స్టార్‌గా గుర్తింపు పొందారు. యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు కృష్ణంరాజు. తనదైన మేనరిజంతో ఆడియెన్స్ అలరించారు. వయసు భారంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

 ప్రస్తుతం తనయుడు, ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో తన కూతురుని నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. కృష్ణంరాజు శ్యామలా దేవిని పెళ్లాడారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కెరీర్ ఆరంభంలో కృష్ణం రాజు జర్నలిస్టుగా పని చేశారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఓటీటీలో మీకోసం వీకెండ్‌ లో దుమ్మురేపే 5 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Karthika Deepam 2 Today Episode: కాశీని రెచ్చగొట్టిన వైరా- శ్రీధర్ అరెస్ట్- రక్తం కక్కుకున్న సుమిత్ర