ఎన్టీఆర్ బయోపిక్.. అనవసరంగా ఇరుక్కున్నాడు

By Prashanth MFirst Published Feb 12, 2019, 3:03 PM IST
Highlights

కాంట్రవర్సీ ప్రాజెక్టులను.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథలను టచ్ చేయడం అంటే కత్తి సాము లాంటిది. ఇక బయోపిక్ ని తాకలంటే తెగించే ధైర్యంతో పాటు ఛాలెంజింగ్ గా తీసుకొని అందరికి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు తెరకెక్కించాలి. అయితే దర్శకుడు క్రిష్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడనే టాక్ ఇప్పుడు వైరల్ అయ్యింది..గతంలో ఎప్పుడు లేని విధంగా క్రిష్ చేసిన సినిమా దారుణంగా బెడిసికొట్టింది. 

కాంట్రవర్సీ ప్రాజెక్టులను.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథలను టచ్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఇక బయోపిక్ ని తాకలంటే తెగించే ధైర్యంతో పాటు ఛాలెంజింగ్ గా తీసుకొని అందరికి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు తెరకెక్కించాలి. అయితే దర్శకుడు క్రిష్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడనే టాక్ ఇప్పుడు వైరల్ అయ్యింది..గతంలో ఎప్పుడు లేని విధంగా క్రిష్ చేసిన సినిమా దారుణంగా బెడిసికొట్టింది. 

ఎన్టీఆర్ లాంటి మహానానుభావుడి సినిమాను కథానాయకుడిగా తెరకెక్కించి జనాల్ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్ అనుకున్న టైమ్ కి రావడం కూడా డౌట్ గా మారింది. అసలైతే ఈ బయోపిక్ నుంచి తేజ తప్పుకోగానే క్రిష్ బాలయ్య దగ్గరకు వచ్చి నేనే చేస్తాను అని చెప్పాడు. బాలకృష్ణ కూడా గౌతమి పుత్ర శాతకర్ణి సక్సెస్ ఇచ్చాడని సినిమాను చేతుల్లో పెడితే అంతా రివర్స్ అయ్యింది. 

సినిమాను కొన్న బయ్యర్స్ చాలా వరకు నష్టపోయారు. అయితే క్రిష్ ఇప్పుడు ఇతర హీరోల దగ్గరకు వెళ్లి కథలను చెప్పలేని పరిస్థితి. ఎన్టీఆర్ ఫ్లాప్ ఎఫెక్ట్ పడటంతో ఇతర హీరోలు క్రిష్ తో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. గతంలో మహేష్ - రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలకు లైన్ చెప్పి ఒకే చేయించుకున్న క్రిష్ కథను డెవలప్ చేసే క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ని టచ్ చేయడంతో ఎరక్కపోయి ఇరుక్కున్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. 

మరోవైపు కంగనా మణికర్ణిక ఇష్యు కూడా ఈ దర్శకుడిపై గట్టిగానే ప్రభావం చూపింది. అలాగే అంతరిక్షం లాంటి సినిమా నిర్మాణ భాగంలో ఉన్న క్రిష్ అందులో కూడా నష్టలను చూశాడు. అలాంటి సమయంలో ఎన్టీఆర్ హిట్టయ్యి ఉంటే క్రిష్ దశ మారేది. ఎదుగుతున్న సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ ఒకే చేసి దెబ్బ తిన్న క్రిష్ సెకండ్ పార్ట్ తో అయినా రికవర్ అవుతారో లేదో చూడాలి. .  

click me!