నేనొక అనాథలా ఫీల్ అవుతున్నా.. ఖుష్బూ భావోద్వేగ ట్వీట్

Published : Aug 07, 2018, 10:11 PM ISTUpdated : Aug 07, 2018, 10:15 PM IST
నేనొక అనాథలా ఫీల్ అవుతున్నా.. ఖుష్బూ భావోద్వేగ ట్వీట్

సారాంశం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం మృతి చెందారు. ఆయన మృతిపై సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం మృతి చెందారు. ఆయన మృతిపై సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రిని పోగొట్టుకొని అనాధలా ఫీల్ అవుతున్నానని భావోద్వేగంగా ట్వీట్ చేశారు.

'సూర్యుని కుమారుడు అస్తమించారు, మళ్లీ ఆయన ఉదయించరు. కరుణానిధి శకం ముగిసింది. తమిళనాడు ప్రజల మనసుల్లో ఆయన పేరు అల్లుకుపోయింది. ఓ మహానేతగా ప్రజల హృదయాల్లో ఆయన ఎప్పటికీ నిలిచిపోతారు' అంటూ ట్వీట్ చేసి నెల రోజుల క్రితం కరుణానిధితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ''నెల రోజుల క్రితం ఆయనతో కలిసి దిగిన చివరి ఫోటో ఇది.

కానీ ఇదే చివరి ఫోటో అవుతుందని, ఆ మహానేతని చూసే చివరి క్షణం అవుతుందని నేను ఊహించలేదు. మిస్ యూ అప్పా'' అని ట్వీట్ చేశారు. మరొక ట్వీట్ లో 'ఇప్పుడు నేనొక అనాధలా ఫీల్ అవుతున్నాను' అంటూ ఎమోషనల్ అయ్యారు. 
 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్