సన్నీపై కేరళ సూపర్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టిలకు ఈర్ష్య -వర్మ

First Published Aug 19, 2017, 2:07 PM IST
Highlights
  • సన్నీ లియోనీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయిన దేశ భారతం
  • పోర్ట్ స్టార్ సన్నీ లియోనీకి కేరళలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్
  • స్టార్ హీరోలు కూడా కుళ్లుకునేలా సన్నీ కోసం వచ్చిన జనం

సన్నీలియోన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి కొంతమంది స్టార్స్ ఏడుస్తున్నారు. సన్నీని చూసి స్టార్స్ ఏడవటమేంటి.. అనుకుంటున్నారా..? నిజమేనండీ ... మన ట్విట్టర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్వయంగా ఈ మాట చెప్పాడు. సన్నీని ఫ్యాన్స్ చూపిస్తున్న నిజాయితీని చూసి కొంతమంది స్టార్స్ కుళ్లుకుంటున్నారట. ఇంతకూ ఆ స్టార్స్ ఎవరనేగా మీ డౌట్..?

ఈసారి మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ లను టార్గెట్ చేశాడు మన వర్మ. కేరళలో సన్నీలియోన్ కు వచ్చిన ప్రజాస్పందనను చూసి వీరిద్దరూ అసూయతో ఏడుస్తారని ఫేస్ బుక్ ద్వారా కామెంట్ చేశాడు. సన్నీ కి ఉన్న క్రేజ్ ముందు ఈ సూపర్ స్టార్లు కూడా దిగదుడుపే అంటూ అంతటి అభిమానాన్ని చూపించిన కేరళవాసులమీద తన ప్రేమని కురిపించేసాడు.

సన్నీలియోన్ రెండ్రోజుల క్రితం కేరళలోని కొచ్చి వెళ్లింది. అక్కడ ఓ మొబైల్ షోరూమ్ ఓపెనింగ్ పాల్గొంది. అప్పుడు సన్నీలియోన్ కోసం వేలాది మంది ఫ్యాన్స్ గుమికూడారు. ఓ దశలో ఆమె కారును మొత్తం చుట్టుముట్టేసి కదిలే పరిస్థితి లేకుండా చూశారు. ఫ్యాన్స్ అభిమానాన్ని చూసి సన్నీలియోన్ తెగ సంబరపడిపోయింది.

 

అయితే సన్నీలియోన్ పై ఫ్యాన్స్ చూపిన అభిమానాన్ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో విధంగా అభివర్ణించారు. కేరళ ప్రజలు సన్నీలియోన్ పై అసాధారణమైన నిజాయితీ చూపించారని కొనియాడారు. వారి నిజాయితీని చూసి కేరళ  ప్రముఖ నటులైన మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటివారు ఏడుస్తున్నారని చెప్పారు. ఎందుకంటే వారికోసం ఎప్పుడూ ఇంతమంది జనం రాలేదంట.

రామ్ గోపాల్ వర్మ ఎందుకలా అన్నాడో ఇప్పుడు అర్థమైందిగా .. సన్నీలియోన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి కేరళ స్టార్స్ ఎందుకు ఏడుస్తున్నారో..? వర్మ మారతానంటాడు  కానీ మారడు. రోజులో ఎవరో ఒకరిని ఏదో ఒక విషయంలో సెటైర్ వేస్తేనే నిద్ర పడుతుందేమో వర్మకు..

 

click me!