కేబీసీలో అమితాబ్ ని మెప్పించిన బుడ్డోడు.. బ్రిటన్ ప్రధానికి స్పెషల్ మెసేజ్

By team teluguFirst Published Dec 8, 2022, 12:10 PM IST
Highlights

బిగ్ బి అమితాబ్ హోస్ట్ గా చేస్తున్న షో కౌన్ బనేగా కరోడ్ పతి ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలతో కంటెస్టెంట్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ బిగ్ బి ఈ షోని రసవత్తరంగా నడిపిస్తున్నారు.

బిగ్ బి అమితాబ్ హోస్ట్ గా చేస్తున్న షో కౌన్ బనేగా కరోడ్ పతి ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలతో కంటెస్టెంట్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ బిగ్ బి ఈ షోని రసవత్తరంగా నడిపిస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ లో పోటీదారుడిగా ఓ బుడ్డోడు పాల్గొన్నాడు. ఆ చిన్నారి పేరు ఆదిత్య శ్రీవాస్తవ. 

ఆదిత్య నాలెడ్జ్ కి అమితాబ్ బచ్చన్ ఇంప్రెస్ అయ్యారు. ఇస్రోలో పనిచేయడం తన ఆశయం అని ఆదిత్య అమితాబ్ బచ్చన్ కి తెలిపారు. అలాగే అమితాబ్.. ఆదిత్యకి ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తిని పరిచయం చేశారు. సుధా మూర్తి ఎన్నో రచనలు చేసిన సంగతి తెలిసిందే. 

ఆదిత్య.. సుధా మూర్తితో మాట్లాడుతూ మీ రచనలు చదివానని తెలిపాడు. అలాగే బ్రిటన్ కి కొత్తగా ప్రధానిగా భాద్యతలు చేపట్టిన సుధా మూర్తి అల్లుడు రిషి సునాక్ కి ఆదిత్య శుభాకాంక్షలు తెలిపాడు. దీనితో సుధా మూర్తి స్పందించారు. నీ విషెష్ ని రిషి సునాక్ కి మెసేజ్ రూపంలో పంపిస్తానని హామీ ఇచ్చారు. 

రిషి సునాక్.. సుధా మూర్తి, నారాయణ మూర్తికి అల్లుడు. వీరి కుమార్తె అక్షతా మూర్తిని రిషి సునాక్ వివాహం చేసుకున్నారు. బ్రిటన్ కి ప్రధాని అయిన తొలి  సంతతి వ్యక్తి రిషి సునాక్. రిషి సునాక్ ప్రధానిగా భాద్యతలు చేపట్టినప్పుడు ఇండియా నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 

click me!