మారిన వరస: ఇంట్లో వదిన...సెట్లో అక్క

By Udaya DFirst Published Apr 15, 2019, 9:36 AM IST
Highlights

అప్పట్లో భార్య భర్తలు అయిన  కృష్ణ-విజయ నిర్మల.. తెరపై అన్నా చెల్లెళ్లుగా చేస్తే జనం విస్తుపోయి చూసారు.

అప్పట్లో భార్య భర్తలు అయిన  కృష్ణ-విజయ నిర్మల   ...తెరపై అన్నా చెల్లెళ్లుగా చేస్తే జనం విస్తుపోయి చూసారు. ఆ తర్వాత అంత ధైర్యం ఎవరూ చెయ్యలేదు. ఇదిగో మళ్లీ ఇంతకాలానికి వదినా-మరిది తెరపై అక్కా -తమ్ముడుగా కనిపించి ఫ్యాన్స్ ని అలరించబోతున్నారు. వాళ్లు మరెవరో కాదు జ్యోతిక-కార్తి. 

కార్తీకి, జ్యోతిక సొంత వదిన. తన అన్న సూర్యకు భార్య. కానీ కార్తీ  జ్యోతికకు తమ్ముడిగా మారనున్నారు.  ప్రముఖ మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్‌ తమిళంలో ఓ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కించనున్నారు. సస్పెన్స్ కలగలిపిన ఈ సినిమా కోసం అక్క, తమ్ముడు పాత్రల కోసం జ్యోతిక, కార్తీలను ఒప్పించారు.  జీతూ జోసఫ్ గతంలో దృశ్యం మళయాళ చిత్రం డైరక్ట్ చేసి సూపర్ హిట్ ఇచ్చారు. 

ఇక ఈ చిత్రం కథ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు చిన్న పాటి సస్పెన్స్ తో సాగుతుందని సమాచారం. ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు జ్యోతిక, కార్తీ. వాళ్ల కమిట్‌మెంట్స్‌ పూర్తికాగానే జూన్‌లో ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవుతారట. ఇందులో మిగతా నటీనటులను, టెక్నీషియన్స్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు. 

కార్తీ, జ్యోతిక ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే కాబట్టి డబ్బింగ్‌ చేసి ఇక్కడ కూడా రిలీజ్‌ చేస్తారంటున్నారు. జ్యోతిక తన సినిమాలో చేస్తూండటంతో కార్తీ ఫుల్ ఖుషీ గా ఉన్నారట. సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. సూర్య కూడా గెస్ట్ రోల్ చేస్తే బాగుటుందని అభిమానులు అంటున్నారు.

click me!