ఈ మనిషి ఈగ తోనే అంత చేశాడు, పైకి లేచి క్లాప్స్ కొట్టా.. రాజమౌళిపై కరణ్ జోహార్ కామెంట్స్

By team teluguFirst Published Dec 18, 2021, 1:27 PM IST
Highlights

కరణ్ జోహార్ 'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల చేస్తున్నారు. 

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బాహుబలి చిత్రాన్ని హిందీలో విడుదల చేశారు. బాహుబలి చిత్రం నార్త్ లో అంతలా ఆడియన్స్ కు రీచ్ అయింది అంటే కరణ్ జోహార్ కూడా ఒక కారణం. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో బాహుబలి చిత్రం హిందీలో విడుదలైంది. దీనితో రాజమౌళి, కరణ్ జోహార్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. 

ప్రస్తుతం కరణ్ జోహార్ 'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల చేస్తున్నారు. ఇది పార్ట్ 1 మాత్రమే. ఈ చిత్రానికి తదుపరి భాగాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో నేడు మీడియా సమక్షంలో మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఊహించని సర్ ప్రైజ్ ఏంటంటే బ్రహ్మాస్త్రం చిత్రాన్ని సౌత్ లో రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నారు. 

ఈ కార్యక్రమానికి రాజమౌళి అతిథిగా హాజరయ్యారు. రణబీర్ కపూర్ వేదికపైకి రాగానే రాజమౌళి పాదాలకు నమస్కరించడం విశేషం. ఈ కార్యక్రమంలో కరణ్ జోహార్ మాట్లాడుతూ రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు. మనమంతా ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అందుకు కారణం జీనియస్ రాజమౌళి. రాజమౌళి వల్ల భాషా బేధాలు మొత్తం తొలిగిపోయాయి. 

Also Read: Anasuya : వామ్మో..ఆ మూవీలో అనసూయ విధ్వంసం.. పరువాలతో బెడ్ పై రెచ్చిపోయిన యాంకర్

స్టూడెంట్ నెం 1 నుంచి ఆయన ప్రతి చిత్రం చూశాను. ఈగ సినిమా చూస్తూ సీట్ లో నుంచి పైకి లేచి క్లాప్స్ కొట్టా. కేవలం ఈగతోనే ఈ మనిషి అంత చేస్తే ఇక మనుషులతో ఎంత చేయగలడు అనుకున్నా. ఇప్పుడు ఆయన అదే చేసి నిరూపిస్తున్నారు. తమ చిత్రానికి రాజమౌళి కూడా భాగం కావడం సంతోషంగా ఉందని కరణ్ జోహార్ అన్నారు. 

 

click me!