Kantara 2: కాంతార చాప్టర్ 1 ఇండియాలో బిగ్గెస్ట్ రిలీజ్‌.. ఎన్ని వేల స్క్రీన్లలో తెలిస్తే మతిపోవాల్సిందే

Published : Sep 24, 2025, 07:50 PM IST
kantara 2

సారాంశం

Kantara 2: రిషబ్ శెట్టి దర్శకత్వంలో భారీగా రాబోతున్న సినిమా `కాంతార చాప్టర్ 1`.  దసరా పండగని పురస్కరించుకుని విడుదల కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌ డేట్‌ వినిపిస్తోంది. 

కాంతార చాప్టర్ 1 ట్రైలర్‌తో ట్రెండింగ్ 

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కన్నడ సినిమా `కాంతార`. దీని రెండో భాగం `కాంతార చాప్టర్‌ 1` ఇప్పుడు భారీగా విడుదలవుతోంది. ఇటీవల రిలీజైన `కాంతార చాప్టర్ 1` ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. 24 గంటల్లోనే ఇది ఏకంగా 107 మిలియన్స్ వ్యూస్‌ని రాబట్టి అన్ని రికార్డులను బ్రేక్‌ చేసింది. దీంతో సినిమాపై హైప్‌ మరింత పెరిగింది. `కాంతార` రెండో భాగంలో కూడా కళ్లు చెదిరే విజువల్స్ ఉంటాయని ఈ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. 

7 వేల స్క్రీన్లలో `కాంతార 2`

ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్‌ డేట్‌ వినిపిస్తోంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా 7,000 స్క్రీన్లలో రిలీజ్ అవుతుందని కొత్త సమాచారం. రాబోయే అన్ని అప్‌డేట్‌లను హోంబలే ఫిలింస్ పేజీలో చూడొచ్చు. ఈ సినిమా రెండో భాగం అక్టోబర్ 2న కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ తోపాటు స్పానిష్‌ భాషలోనూ రిలీజ్‌ చేస్తున్నారట. ఇలా భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ముందే ప్రకటించింది.

పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతున్న కాంతార చాప్టర్ 1

చాలా తక్కువ బడ్జెట్‌లో రిలీజై భారీ విజయం సాధించిన `కాంతార` మొదటి భాగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తర్వాత ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్, తుళు వెర్షన్లు కూడా రిలీజై, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. అందుకే, సినిమా అభిమానులు `కాంతార`(కాంతార 2) రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన `కాంతార 2`

రిషబ్ శెట్టి కథ రాసి దర్శకత్వం వహిస్తున్న `కాంతార చాప్టర్ 1`ను విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటించింది. మూడేళ్ల షూటింగ్ తర్వాత ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.  ఇంతకుముందు రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్, టీజర్ ట్రెండింగ్‌లో ఉండి, అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్‌ దేశ వ్యాప్తంగా ట్రెండ్‌ అవుతుంది. కల్పన, పురాణం కలిసిన ఒక అద్భుతమైన విజువల్ అనుభవాన్ని ఇచ్చిన కాంతార, బ్లాక్‌బస్టర్ జాబితాలో చేరింది. దాని రెండో భాగం మళ్లీ చరిత్ర సృష్టించడానికి ఇంకొన్ని రోజులే ఉన్నాయి.

రూ.400కోట్లు వసూలు చేసిన `కాంతార`

మూడేళ్ల క్రితం విడుదలైన `కాంతార` చిత్రంలో రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో ఆయనకు జోడీగా సప్తమి గౌడ నటించింది. కిశోర్‌, అచ్యుత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. కర్నాటకలోకి తీర ప్రాంతంలోని జానపద కథలను బేస్ట్ చేసుకుని భూత కోల అనే సంస్కృతిక కళని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆథ్యాత్మికతకు, ఒక భూస్వామి కుట్రలకు ముడిపెడుతూ రూపొందించిన ఈ చిత్రం విశేషంగా ఆదరణ పొందింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.400కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. కేవలం రూ.14 కోట్లు తెరకెక్కి ఈ స్థాయిలో వసూళ్లు చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో `కాంతార 2`ని భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో రూపొందించారు రిషబ్‌ శెట్టి. మరి మొదటి సినిమా రేంజ్‌లో ఇది ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.

 

 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

NTR and Vijay: ఆగిపోయిన ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు.. బెడిసికొడుతున్న రాజమౌళి స్ట్రాటజీ
Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?