బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు కమల్ హాసన్ స్పెషల్ ట్రీట్.. వైరల్ అవుతున్న పోటోస్

By Mahesh JujjuriFirst Published Jan 16, 2024, 5:13 PM IST
Highlights

లోకనాయకుడు  కమల్ హాసన్ 'బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7' కంటెస్టెంట్స్  కు సర్ ప్రైజ్ ఇచ్చారు. స్పెషల్ పార్టీతో పాటు విందు ఏర్పాటు చేసి పండగ పూట సందడి చేశారు. ప్రస్తుతం  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత అక్టోబర్‌లో ప్రారంభమైన బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7లో 18 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. మొదటి సీజన్ నుండి అద్భుతంగా హోస్ట్ చేస్తున్నారు లోక నాయకుడు కమల్ హాసన్.. అయితే ముందు 6 సీజన్ల కంటే కూడా డిఫరెంట్ గా సీజన్ 7న స్టార్ట్ చేశారు. అంతే డిఫరెంట్ గా ఈ సీజన్ ను నడిపించారు కమల్.  ముఖ్యంగా ఈసారి , కెమెరాల సంఖ్యను కూడా పెంచారు. టీమ్. 

అలాగే ఈసారి కమల్ హాసన్ తన రెమ్యునరేషన్ ను 100 కోట్ల నుంచి 150 కోట్లకు పెంచినట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 7 ఎటువంటి సమస్యలు మరియు వివాదాలు లేకుండా గత ఆదివారం ముగిసింది, వైల్డ్ కార్డ్ ద్వారా ప్రవేశించిన అర్చన ట్రోఫీని కైవసం చేసుకుంది. మణిచంద్రకు ద్వితీయ స్థానం, మాయకు తృతీయ స్థానం లభించాయి. అలాగే దినేష్ 4వ స్థానంలో, విష్ణు 5వ స్థానంలో నిలిచారు.

Latest Videos

ఈ బిగ్ బాస్ షోలో కమల్ గత బిగ్ బాస్ సీజన్లలో ఎదుర్కోని విమర్శలను ఎదుర్కొన్నాడు. ఈసారి కొట్లాటలు.. గొడవలు.. బయట కూడా ప్రభావం చూపించి.. కోలీవుడ్ నటి వనిత విజయ్ కుమార్ పై దాడి జరిగింది.  ముఖ్యంగా ప్రదీప్ కు ఎలాంటి విచారణ లేకుండానే రెడ్ కార్డ్ పడింది. ఈ విషయంపై వినూష బహిరంగంగా మాట్లాడకపోవడం కూడా మాయ విషయాన్ని కప్పిపుచ్చుతోందని అంటున్నారు.దాంతో కమల్ కు కాస్త ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. 

ఇక బిగ్ బాస్ సీజన్ 7 ముగియడంతో, కమల్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కుపార్టీ  ఇచ్చాడు. కంటెస్టెంట్స్ తో పాటు.. బిగ్ బాస్ సక్సెస్ అవ్వడానికి కారణం అయిన ప్రతీ ఒక్కరికి ఆయన గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు.  పొంగల్ సందర్భాగా కమల్ ఈ పార్టీని ఇచ్చాడు. కమల్ హాసన్ కూడా తలైవాజల్ పార్టీలో చాలా వెరైటీగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు విడుదలై వైరల్ అవుతున్నాయి.

click me!