ఫస్ట్ షోతోనే సినిమా అద్భుతమనే టాక్ని సంపాదించుకుంది
లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా నేడు(బుధవారం) రిలీజ్ అయింది. ఫస్ట్ షోతోనే సినిమా అద్భుతమనే టాక్ని సంపాదించుకుంది. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సావిత్రి నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం, సినిమాలో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తుండడంతో సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటించగా.. మరికొన్ని కీలక పాత్రల్లో సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు నటించారు.
అయితే ఈ సినిమాలో మరో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా నటిస్తోందంటూ చిత్రబృందం ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది. ‘మహానటి’లో కాజల్ ఏమి చేస్తోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మే తొమ్మిదో తేదీ వరకు ఆగండి’ అంటూ కామెంట్ కూడా పెట్టింది. కానీ సినిమా చూసిన ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఈ సినిమాలో కాజల్ లేనేలేదు. ఆమె పాత్ర ఎడిటింగ్లో ఎగిరిపోయిందని తెలుసుకుని ఆమె అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.