కార్తి హీరోగా `విక్రమ్` ఫేమ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన `ఖైదీ` చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. దీనికి సీక్వెల్ రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చాడు కార్తి.
కార్తి(Karthi)కి ఇటీవల మంచి సూపర్ హిట్గా నిలిచిన చిత్రం `ఖైదీ`(Kaithi). `విక్రమ్` ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మూడేళ్ల క్రితం వచ్చి భారీ విజయం సాధించింది. గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే, యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం తమిళ ఆడియెన్స్ నే కాదు, తెలుగు ఆడియెన్స్ ని కూడా ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక్కడ కూడా మంచి కలెక్షన్లని సాధించింది.
లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ కి భీజం వేసింది ఈ చిత్రంతోనే. ఆ తర్వాత ఆయన విజయ్ తో `మాస్టర్`, `విక్రమ్`(Vikram) చిత్రాలను రూపొందించారు. ఇందులో `ఖైదీ`(Kaithi2)కి సీక్వెల్ లింక్, `విక్రమ్`కి సీక్వెల్ లింక్ ఇచ్చాడు. దీంతో లోకేష్నుంచి ఈ `లోకేష్ సినిమాటిక్ యూనివర్స్` నుంచి వరుసగా సినిమాలు రాబోతున్నాయనేది స్పష్టమైంది. అయితే ప్రస్తుతం విజయ్తో ఓ సినిమా చేస్తున్నారు లోకేష్. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది.
ఈ నేపథ్యంలో `ఖైదీ` సీక్వెల్పై కూడా క్లారిటీ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ డిటెయిల్స్ వెల్లడించారు కార్తి. ఆయన నటించిన `విరుమన్` చిత్ర ప్రమోషన్లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నెక్ట్స్ ఇయర్ ప్రారంభంలో `ఖైదీ2` ప్రారంభమవుతుందని చెప్పారు కార్తి. ప్రస్తుతం విజయ్తో లోకేష్ ఓ సినిమా చేస్తున్నారని, అది పూర్తవగానే మా సినిమా ఉంటుందన్నారు. కచ్చితంగా ఉంటుందనే విషయాన్ని కార్తి చెప్పడం విశేషం.
about 🌟
- We'll start Next year After Lokesh Finishes sir' Film..🔥 pic.twitter.com/DB44QWKz2Z
ఈ లెక్కన `విక్రమ్ 2` సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఉంటుందని చెప్పొచ్చు. ఇక కమల్ హాసన్ హీరోగా, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించిన `విక్రమ్` సినిమా జూన్ మొదటివారంలో విడుదలై సంచలన విజయం సాధించింది. సాధారణ టికెట్ రేట్లలోనూ ఈ చిత్రం నాలుగువందల కోట్లు వసూలు చేసింది. కోలీవుడ్కి కొత్త ఊపుని తీసుకొచ్చింది. నిర్మాతలు కమల్కి అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది.