సాయిధరమ్ తేజ్ కి జూ.ఎన్టీఆర్ సాయం.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ వైరల్

By team teluguFirst Published Dec 1, 2022, 11:57 AM IST
Highlights

గత ఏడాది బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం తేజు తన 15వ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

గత ఏడాది బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం తేజు తన 15వ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సాయిధరమ్ తేజ్ చివరగా రిపబ్లిక్ అనే చిత్రంలో నటించాడు. 

ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ప్రస్తుతం తేజు తన తదుపరి చిత్రం కోసం బాగా కష్టపడుతున్నాడు. కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

తాజాగా ఈ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వైరల్గా మారింది. సాయిధరమ్ తేజ్ చిత్రాన్ని సాయం అందించేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర టైటిల్, టీజర్ ని ఎన్టీఆర్ లాంచ్ చేయనున్నారట. డిసెంబర్ 7న ఈ చిత్ర టైటిల్, టీజర్ లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. 

ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తేజుకి జోడిగా భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాంతారా ఫేమ్ అంజనీష్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అజయ్, సునీల్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

click me!