దేవరకి జాన్వీ కపూర్ మామూలు హైప్ ఇవ్వడం లేదుగా.. పాన్ ఇండియా లెవల్లో పబ్లిసిటీ 

By tirumala ANFirst Published Jan 5, 2024, 4:55 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. యుదసుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్ పైఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 ఈ చిత్రాన్ని ప్రారంభించే సమయంలో కొరటాల శివ మాట్లాడుతూ తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుంది అని ఫ్యాన్స్ కి ప్రామిస్ చేశారు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని కొరటాల శివ పక్కా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారు.   

Latest Videos

దేవర చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనవరి 8న ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేయనున్నారు,. అంతకంటే ముందుగానే జాన్వీ కపూర్ దేవర చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో హైప్ పెంచేస్తోంది. జాన్వీ కపూర్ రీసెంట్ గా తన సోదరి ఖుషి కపూర్ తో కలసి కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. 

ఈ షోలో జాన్వీ కపూర్ దేవర చిత్రం గురించి ఒక రేంజ్ లో చెప్పింది. ఈ మూవీలో జాన్వీ తంగం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తాను నటించిన చిత్రాలన్నీ ఒకెత్తు.. దేవర మూవీ మరో ఎత్తు అని జాన్వీ కపూర్ తెలిపింది. సెట్ కి వెళ్ళగానే ఒక మంచి పాత్రలో నటిస్తున్న ఫీలింగ్ వచ్చింది. నేను గతంలో నటించిన చిత్రాలన్నీ దేవర చిత్రానికి రిహార్సల్స్ లాగా అనిపించినట్లు జాన్వీ కపూర్ తెలిపింది. 

పాన్ ఇండియా వేదికపై కరణ్ జోహార్ లాంటి బడా నిర్మాత ముందు జాన్వీ కపూర్ దేవర చిత్రానికి మంచి ఎలివేషన్ ఇచ్చింది. జనవరి 8న రాబోతున్న టీజర్ ఆ రేంజ్ లో ఉంటే సినిమాకు కనివిని ఎరుగని అంచనాలు ఏర్పడతాయి. 

click me!