పవన్‌పై వ్యాఖ్యలు: పోసానిపై జనసైనికుల ఆగ్రహం.. పంజాగుట్ట పీఎస్ వద్దకు భారీగా జనసేన కార్యకర్తలు

Siva Kodati |  
Published : Sep 28, 2021, 08:37 PM ISTUpdated : Sep 28, 2021, 08:39 PM IST
పవన్‌పై వ్యాఖ్యలు: పోసానిపై జనసైనికుల ఆగ్రహం.. పంజాగుట్ట పీఎస్ వద్దకు భారీగా జనసేన కార్యకర్తలు

సారాంశం

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పోసానిపై ఫిర్యాదు చేసేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.   

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పోసానిపై ఫిర్యాదు చేసేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. 

అంతకుముందు సోమాజిగూడ్(Somajiguda) ప్రెస్ క్లబ్‌లో పోసాని(Posani) మురళీ కృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్‌(Pawan kalyan)పై విమర్శలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన(Jansena) కార్యకర్తలు వెంటనే పరుగున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గరకు వచ్చారు. పోసాని మురళీ కృష్ణ ప్రెస్ మీట్ అడ్డుకోవడానికి యత్నించారు. పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ALso Read:సర్దార్ గబ్బర్‌సింగ్‌` నుంచి పవనే నన్ను తీసేశాడుః పోసాని సంచలన వ్యాఖ్యలు

దీంతో ప్రెస్ క్లబ్ ఎదుట ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడ మోహరించారు. పలువరు అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోసాని మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి తనకు ప్రాణహానీ వుందన్నారు . పవన్ కల్యాణ్‌పై రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు ఏమైనా జరిగితే పవన్ కల్యాణ్‌దే బాధ్యత అని పోసాని హెచ్చరించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్