
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సారి మూడు విభిన్న పాత్రలలో నటిస్తున్న చిత్రం జై లవకుశ. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేదా థామస్, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. నందమూరి ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ లుక్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని అందిస్తుంది. పోస్టర్ లో ఎన్టీఆర్ రౌద్రం, రాజసం కలగలిపిన రావణుడి గా కనిపిస్తున్నాడు. ఇది ఎన్టీఆర్ నెగెటివ్ లుక్ అని అంటున్నారు. ఆగస్ట్ రెండో వారంలో విడదుల కానున్న ఈ చిత్రంపై తాజాగా విడుదలైన పోస్టర్స్ భారీ హైప్ తెచ్చాయి.