ఇంటెన్స్ డ్రామాగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీజర్.. డీప్ ఫారెస్ట్ లో అల్లరి నరేష్ పోరాటం

By team teluguFirst Published Jun 30, 2022, 4:37 PM IST
Highlights

అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సీరియస్ ఫారెస్ట్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాంది చిత్రంతో అల్లరి నరేష్ ఒకరకంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు అనే చెప్పాలి. గతంలో కామెడీ చిత్రాలతో హిట్స్ మీద హిట్స్ కొట్టిన అల్లరి నరేష్ కి చాలా కాలం పాటు విజయాలు లేవు. గత ఏడాది విడుదలైన నాంది చిత్రం అల్లరి నరేష్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. కానీ నాంది చిత్రం కామెడీ మూవీ కాదు. సీరియస్ డ్రామా. 

అదే పంథాలలో కంటెంట్ ఉన్న కథలవైపే అల్లరి నరేష్ ప్రస్తుతం దృష్టి పెడుతున్నాడు. అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సీరియస్ ఫారెస్ట్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో ట్రైబల్స్ జీవితాలని ఈ చిత్రంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. 

నేడు అల్లరి నరేష్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. డీప్ ఫారెస్ట్ లో జరిగే ఎమోషల్ డ్రామాగా ఈ చిత్రం అనిపిస్తోంది. ఓట్లు అడిగేందుకు డీప్ ఫారెస్ట్ లో ఉన్న మారేడు మిల్లి ప్రాంతానికి వెళతారు అల్లరి నరేష్ అండ్ టీం.. అక్కడ వాళ్ళకి ఎదురైనా సవాళ్లు ఏంటి? అల్లరి నరేష్ పోలిసుల చేతిలో ఎందుకు దెబ్బలు తింటున్నాడు అనేది టీజర్ లో ఆసక్తి రేపుతున్న అంశాలు. 

యంగ్ బ్యూటీ ఆనంది ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, ప్రవీణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్ అండ్ హాస్య మూవీస్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

 

click me!