ఇటీవల రైల్వే ప్లాట్ ఫార్మ్ మీద పాట పాడిన ఒక మహిళ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎవరు ఊహించని విధంగా బాలీవుడ్ సినిమాలో పాట పాడేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేషమ్మియా ఆమెతో ఒక పాటను రే రికార్డింగ్ చేసి తన మద్దతు ఇచ్చాడు.
ఇటీవల రైల్వే ప్లాట్ ఫార్మ్ మీద పాట పాడిన ఒక మహిళ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎవరు ఊహించని విధంగా బాలీవుడ్ సినిమాలో పాట పాడేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేషమ్మియా ఆమెతో ఒక పాటను రే రికార్డింగ్ చేసి తన మద్దతు ఇచ్చాడు.
ఇటీవల కోల్ కత్తా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్ మీద రను మొండల్ అనే మహిళ ఏక్ ప్యార్ గా నగ్మా హై అనే సాంగ్ పాడింది. అందుకు సంబందించిన వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి బాలీవుడ్ ని ఆకర్షించింది. వెంటనే సూపర్ స్టార్ సింగర్ షోకి ఆమెను అతిధిగా పిలిపించారు. జడ్జ్ గా ఉన్న హిమేష్ రేషమ్మియా ఆమె గాత్రానికి ఫిదా అయిపోయాడు.
వెంటనే ఆమె పాడిన పాటను రికార్డింగ్ చేయించాడు. అంతే కాకుండా తన నెక్స్ట్ సినిమా హ్యాపీ హార్డీ అండ్ హీర్ లో తనతో ఒక పాట పాడించనున్నట్లు ఎనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఆమెకు సంబందించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.