నాకు రాసిపెట్టి లేదనుకుంటా!

By Sambi ReddyFirst Published Oct 28, 2022, 12:15 PM IST
Highlights

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు రాకుండా కోల్పోయిన మంచి పాత్రల విషయంలో తన ఫీలింగ్ ఏమిటో వెల్లడించింది. విధిరాతను నమ్మే సాయి పల్లవి నాకు రాసి పెట్టి లేదు అనుకుంటుందట. 
 


సాయి పల్లవి ప్రత్యేకమైన హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. దానికి కారణం ఆమె చేసే సినిమాలు, ఎంచుకునే పాత్రలు. సాయి పల్లవికి మాత్రమే ఇలాంటి మంచి పాత్రలు ఎలా వస్తున్నాయని మిగతా హీరోయిన్స్ కుళ్ళుకునేలా సాయి పల్లవి సినిమాలు ఉంటాయి. హీరోకి సమానమైన పాత్రలు చేసే హీరోయిన్ ఈ జనరేషన్ లో ఎవరంటే సాయి పల్లవి మాత్రమే. అదే సమయంలో ఇతర హీరోయిన్స్ చేసిన గొప్ప పాత్రలు గురించి సాయి పల్లవి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. 

అయితే తాను కోల్పోయిన అద్భుతమైన పాత్రలను తలచుకొని సాయి పల్లవి బాధపడదట. విధిని గట్టిగా నమ్మే ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ తాను ఆ పాత్ర చేయాలని రాసి లేదనుకుంటుందట. తాను మిస్సయిన గుడ్ రోల్స్ గురించి సాయి పల్లవి నాకు రాసి పెట్టి లేదని సరిపెట్టుకుంటుందట కానీ ఏమాత్రం బాధపడరట. ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో సాయి పల్లవి పాత్రలు చాలా బలమైన కంటెంట్ కలిగి ఉంటాయి. 

ముఖ్యంగా ఫిదా మూవీలో హీరో వరుణ్ తేజ్ ని డామినేట్ చేసేలా సాయి పల్లవి పాత్ర ఉంటుంది. ఫిదా హిట్ క్రెడిట్ మొత్తం సాయి పల్లవిదే అని చెప్పాలి. కాగా సాయి పల్లవి సడన్ గా చిత్రాలు తగ్గిచ్చారు. ఇది ఆమె అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. ఇటీవల సాయి పల్లవి నటించిన గార్గి విడుదలైంది. ఇక కొత్త చిత్రాల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పుష్ప 2 మూవీలో సాయి పల్లవి నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా అధికారిక సమాచారం లేదు. 
 

click me!