బాధ పెట్టాలని కాదు బాధలో ఉండి అలా చేశాను... అల్లు అర్జున్ హీరోయిన్ సంజాయిషీ 

By Sambi ReddyFirst Published Mar 19, 2023, 5:48 PM IST
Highlights

హీరోయిన్ భానుశ్రీ మెహ్రా తన ట్విట్టర్ పోస్ట్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అల్లు అర్జున్ నన్ను బ్లాక్ చేశాడంటూ ఆరోపణలు చేశారు. 
 

వరుడు మూవీలో హీరో అల్లు అర్జున్ కి జంటగా నటించిన భానుశ్రీ మెహ్రాను తెలుగు ప్రేక్షకులు మర్చిపోయి చాలా కాలం అవుతుంది. ఒక్కసారిగా ఆమె వార్తల్లోకి ఎక్కారు. అల్లు అర్జున్ ఆమెను ట్విట్టర్ లో బ్లాక్ చేయడం ఇందుకు కారణమైంది. హీరో అల్లు అర్జున్ తో నేను వరుడు మూవీలో నటించారు. ఆయన నన్ను బ్లాక్ చేశారు. నాకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆనందం వెతుక్కుంటూ ముందుకు వెళుతున్నాను... అని కామెంట్ చేశారు. అల్లు అర్జున్ తనను బ్లాక్ చేసినట్లు ఆధారం చూపుతూ స్క్రీన్ షాట్ షేర్ చేశారు. 

భానుశ్రీ మెహ్రా పోస్ట్ చేసిన కాసేపటికి అల్లు అర్జున్ ఆమెను అన్ బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె మరో ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ నన్ను అన్ బ్లాక్ చేసినందుకు ఆనందంగా ఉంది. నా ఫెయిల్యూర్స్ కి ఏ విధంగానూ అల్లు అర్జున్ కారణం కాదు. ఆయన్ని నేను అందుకు నిందించలేదు, అని కామెంట్ చేశారు. భానుశ్రీ తీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. ఆమెను ట్రోల్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. 

ఈ క్రమంలో మరోసారి ఆమె సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్ అభిమానులను బాధించాలన్న ఉద్దేశం నాకు ఏ కోశాన లేదు. నేను కూడా ఆయన అభిమానినే. ఏదో బాధలో ఉండి ఒక పోస్ట్ పెట్టాను. అంతకు మించి ఏమీ లేదంటూ ట్వీట్ చేసింది. భానుశ్రీ ట్వీట్ వైరల్ గా మారింది. కారణం తెలియదు కానీ సదరు ఫోటో భానుశ్రీ మెహ్రా డిలీట్ చేశారు.  అసలు భానుశ్రీని అల్లు అర్జున్ ఎందుకు బ్లాక్ చేశాడు. కారణం ఏమిటనే చర్చ జరుగుతుంది. అకారణంగా అయితే అల్లు అర్జున్ ఆ పని చేయడు కదా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. 

2010లో వరుడు మూవీతో భానుశ్రీ హీరోయిన్ అయ్యారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన వరుడు డిజాస్టర్. ఆ దెబ్బతో భానుశ్రీని పట్టించుకున్న నాథుడు లేడు. నిజానికి ఈ హీరోయిన్ మీద విపరీతమైన చర్చ జరిగింది. విడుదల వరకు పోస్టర్స్ లో భానుశ్రీని రివీల్ చేయలేదు. ఆది సినిమాకు మంచి ప్రచారం దక్కించింది. సినిమా మాత్రం తేడా కొట్టింది. అడపాదడపా సినిమాలు చేస్తూ ఆమె కెరీర్ నెట్టుకొస్తున్నారు. 

click me!