రోడ్డు ప్రమాదంలో హీరోయిన్ కి తీవ్ర గాయాలు... సహాయం కోరుతూ ప్రకటన!

By Sambi ReddyFirst Published Mar 18, 2024, 12:41 PM IST
Highlights

హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అరుంధతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తోటి నటి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 
 

హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం సోదరుడితో పాటు స్కూటీపై ఆమె ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా వచ్చి అరుంధతి ప్రయాణిస్తున్న స్కూటీని ఢీ కొట్టింది. అరుంధతి, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ తిరువనంతపురంలో గల ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అరుంధతికి ఐసీయూ లో చికిత్స జరుగుతుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. 

అరుంధతి వైద్యానికి సహాయం కోరుతూ ఆమె తోటి నటి గోపిక అనిల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రోడ్డు ప్రమాదానికి గురైన అరుంధతి నాయర్ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు ఐసీయూలో చికిత్స జరుగుతుంది. వైద్యానికి భారీగా ఖర్చు అవుతుంది. మేము చేయగలిగిన సహాయం చేస్తున్నాము. అయినప్పటికీ వైద్యానికి డబ్బులు సరిపోవడం లేదు. మీ వంతు ఆర్థిక సహాయం చేయండి. మీ సహాయం అరుంధతికి మెరుగైన వైద్యం అందించేందుకు తోడ్పడుతుంది... అని ఆమె రాసుకొచ్చారు. 

అరుంధతి బ్యాంకు వివరాలు, గూగుల్ పే నెంబర్ ఆమె పంచుకున్నారు. అరుంధతి 2014లో పొంగు ఏజ్హు మనోహర అనే తమిళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. గత ఏడాది ఆయిరమ్ పోర్ కాసుకల్ అనే చిత్రంలో ఆమె నటించారు. అలాగే 2021లో పద్మిని, డోంట్ థింక్ అనే రెండు వెబ్ సిరీస్లలో నటించింది. అరుంధతి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. 

click me!