రజినీకాంత్ మూవీలో ఆ పాత్ర అమ్మ చేయవద్దు అంది... భలే ఛాన్స్ మిస్ అయ్యిందే!

By Sambi ReddyFirst Published Mar 18, 2024, 11:34 AM IST
Highlights

రజినీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీలో మీనాకు ఓ పాత్ర ఆఫర్ చేశారట దర్శకుడు. కానీ మీనా తల్లి ఆ పాత్ర చేయకు అన్నారట. అయితే ఆ పాత్ర ఐకానిక్ రోల్ గా మిగిలిపోయింది. 
 


1999లో విడుదలైన పడయప్ప బ్లాక్ బస్టర్ హిట్. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో నరసింహ టైటిల్ తో విడుదలైంది. తెలుగులో కూడా ఈ మూవీ భారీ విజయం అందుకుంది. రజినీకాంత్ కి జంటగా సౌందర్య, రమ్యకృష్ణ నటించారు. రమ్యకృష్ణ నెగిటివ్ రోల్ చేసింది. ఏళ్ల తరబడి హీరోపై పగతో రగిలిపోయే నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతం చేసింది. సినిమాకు నీలాంబరి రోల్ హైలెట్ కాగా, జనాలు ఇప్పటికీ ఆ పాత్ర గురించి చెప్పుకుంటారు. 

రమ్యకృష్ణ తప్ప మరొక నటి చేయలేరు అన్నంతగా ఆమె పెర్ఫార్మన్స్ ఉంటుంది. నీలాంబరి పాత్ర రమ్యకృష్ణకు విపరీతమైన పేరు తెచ్చింది. అయితే ఈ పాత్రకు మొదట మీనాను అనుకున్నారట. అయితే మీనా తల్లిగారు ఆ రోల్ నీకు సెట్ కాదు, చేయకు అన్నారట. హోమ్లీ హీరోయిన్ రోల్స్ చేస్తున్న తాను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం సరికాదని తల్లి సూచించారట. అలాగే రజినీకాంత్ కి జంటగా మీనా అనేక చిత్రాలు చేసింది. ఆయనకు విలన్ గా ప్రేక్షకులు అంగీకరించరని మీనా తల్లి అన్నారట. 

అయితే సౌందర్య చేసిన పాత్ర చేయమన్నారట. మీనా ఆ పాత్ర కూడా చేయను అన్నారట. చేస్తే రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్రనే చేస్తాను అన్నారట. మీనా తల్లి కారణంగా నరసింహ మూవీలో నీలాంబరి పాత్ర చేసే అవకాశం కోల్పోయింది. అలాగే నాగార్జున-కృష్ణవంశీ కాంబోలో వచ్చిన నిన్నే పెళ్లాడతా మూవీలో కూడా మీనా హీరోయిన్ గా నటించాల్సిందట. డేట్స్ కుదరక ఆ ఆఫర్ వదులుకుందట. నిన్నే పెళ్లాడతా కూడా సూపర్ హిట్. 

మీనా ఇప్పటికీ హీరోయిన్ గా చేయడం విశేషం. సీనియర్ హీరోలు రజినీకాంత్, వెంకటేష్, మోహన్ లాల్ చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా చేస్తున్నారు. కాగా 2009లో మీనా విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప. 2022లో మీనా భర్త కన్నుమూశాడు. మీనా కూతురు చైల్డ్ ఆర్టిస్ట్ గా తేరి చిత్రంలో నటించింది. 

click me!