దేవుడు నన్ను శిక్షించాడు, ఐదు నెలల వరకు బెడ్ రెస్ట్... హెల్త్ అప్డేట్ విడుదల చేసిన యాషిక ఆనంద్

By team teluguFirst Published Aug 4, 2021, 3:39 PM IST
Highlights

నటి యాషిక ఆనంద్ సోషల్ మీడియా వేదికగా ప్రస్తుత తన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చారు. ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన యాషిక మరో ఐదు నెలల వరకు నడిచే పరిస్థితి లేదని వెల్లడించారు.

ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన నటి యాషిక ఆనంద్ సోషల్ మీడియా వేదికగా ప్రస్తుత తన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చారు. ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన యాషిక మరో ఐదు నెలల వరకు నడిచే పరిస్థితి లేదని వెల్లడించారు. జులై 24న యాషిక ఆనంద్ తన మిత్రులతో ఎస్ యూ విలో ప్రయాణిస్తూ ఉండగా కారు డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో యాషిక ఫ్రెండ్ ఒకరు అక్కడే మరణించడం జరిగింది. 


తీవ్ర గాయాలపాలైన యాషిక ఆనంద్ ని చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తొంటి ఎముకకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావడంతో సర్జరీ తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. మరో ఐదు నెలల వరకు నడవడం, నిల్చోవడం చేయలేను. అన్నీ బెడ్ పైనే జరగాలి. కనీసం ఎటు కదలలేని పరిస్థితి. నా బ్యాక్ చాలా దెబ్బతింది. అదృష్టవశాత్తు నా ముఖానికి ఏమి కాలేదు. ఇది నాకు మరో జన్మ. దేవుడు నన్ను శిక్షించాడు. మానసికంగా, శారీరకంగా చాలా గాయపడ్డాను. నేను కోల్పోయిన దానికంటే ఇవన్నీ తక్కువే... అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు యాషిక ఆనంద్. 


ఇక యాషిక సోషల్ మీడియా పోస్ట్ పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేయడం విశేషం. ఫ్రెండ్ మరణించిందనే బాధ లేకుండా, నా ముఖానికి ఏమి కాలేదని సంతోష పడుతున్నావా... అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమిళంలో 20చిత్రాల వరకు నటించిన యాషిక తెలుగులో విజయ్ దేవరకొండ నోటా మూవీలో నటించడం జరిగింది. 

click me!