
హీరో సిద్ధార్థ్.. `టక్కర్` ప్రీ రిలీజ్ ఈవెంట్ని స్పెషల్గా మార్చారు. తన పాటలతో ఉర్రూతలూగించాడు. అంతేకాదు హీరోయిన్తో కలిసి స్టేజ్పై స్టెప్పులేసి ఈవెంట్ని ఉత్సాహంతో నింపారు. రొటీన్కి భిన్నంగా వ్యవహరించి ఆకట్టుకున్నారు. ఈవెంట్లో హైలైట్ గా నిలిచారు సిద్ధార్థ్. ఆయన హీరోగా `టక్కర్` చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 9న తెలుగు, తమిళంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. ఇందులో దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్ , తరుణ్ భాస్కర్ , వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు పాల్గొన్నారు. ఇందులో సిద్ధార్థ్ పాటలతో, డాన్సులతో ఆకట్టుకున్నారు. యూత్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ, `టక్కర్` సినిమాను మంచి స్కేల్ లో తీశారు. ఇదొక యాక్షన్ ఫిల్మ్. ఈ యాక్షన్ స్టోరీ మధ్యలో ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ ను చూపించారు కార్తీక్ జి. క్రిష్. ఈ సినిమాలో లవర్ బాయ్ రగ్గడ్ గా ఉంటే ఎలా ఉంటుందో చూపించారు.
ఇక్కడికి వచ్చిన అతిధులు అందరికి థాంక్యూ సో మచ్. నేను రామానాయుడుతో చాలా సార్లు మాట్లాడాను. నాకు సురేష్ బాబు, వెంకటేష్ ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. తెలుగు సాహిత్యం, తెలుగు కవిత్వం చూసి , చదివి అది నా లోపలకి వెళ్ళిపోయింది. సో నేను చెప్పిన చెప్పకపోయినా తెలుగు బిడ్డే. జూన్ 9న టక్కర్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా 100% అలరిస్తుంది. టెక్నీకల్ టీం కి థాంక్యూ సో మచ్. దివ్యాంశ కి ఈ సినిమా తరువాత ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సిద్దు ఎప్పుడు చేస్తారు అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా, త్వరలో నేను 6 సినిమాలు రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తాను` అని అన్నారు సిద్ధార్థ్.
దర్శకుడు కార్తీక్ జి. క్రిష్ మాట్లాడుతూ, ఈ సినిమాలో యూనివర్సల్ కంటెంట్ ఉంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి మూడు కారణాలు, మొదటది మీ సిద్దార్ధ్ , తరువాత దివ్యాంశ. మా గురువు గారు శంకర్ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు, ఇప్పుడే అదే బాటలో శిష్యుడు సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ కాలానికి ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది. ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుంది. ఈ సినిమాను థియేటర్ లో చూసి ఎంకరేజ్ చేయండి` తెలిపారు.
ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ, సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు. నేను అమెరికాలో పది సంవత్సరాలు నుంచి ఉంటున్నాను. సినిమాలు డీవిడిలో చూడటం దగ్గరనుంచి థియేటర్ లో నేను చూసిన మొదటి సినిమా `బొమ్మరిల్లు`. అప్పటినుంచి సినిమాలు థియేటర్ లో చూడటం అలవాటు. ఇప్పుడు అంతా పాన్ ఇండియా ఎరా నడుస్తోంది. మేము సుభాన్ తో కలిసి త్వరలో తెలుగులో సినిమాను నిర్మించబోతున్నాం` అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సురేష్బాబు, దర్శకుడు తరుణ్ భాస్కర్, బొమ్మరిల్లు భాస్కర్ ఇతర ప్రముఖలు పాల్గొని టీమ్కి అభినందనలు తెలిపారు.