ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమాలు చేస్తానని హామీ ఇచ్చిన రోజు మళ్ళీ పుట్టాను!

By Sambi ReddyFirst Published Mar 18, 2023, 1:11 AM IST
Highlights

హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ దాస్  కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 
 

ఎన్టీఆర్ మాట్లాడుతూ... నేను టెన్షన్ లో ఉన్నప్పుడు కొన్ని చిత్రాలు చూస్తాను. వాటిలో ఈ నగరానికి ఏమైంది కూడా ఒకటి. ఆ మూవీలో కామెడీ చేయకుండానే విశ్వక్ సేన్ కామెడీ పంచాడు. మొదటి సినిమాలోనే అంత బాగా నటించాలంటే  కాన్ఫిడెన్స్ ఉండాలి. కొత్త వాడు అయినప్పటికీ చాలా సెటిల్డ్ గా నటించాడు.  ఆ చిత్రం తర్వాత ఫలక్ నుమా దాస్ చేశాడు. ఆ సినిమాకు దర్శకత్వం కూడా చేశాడు. 

అశోకవనంలో అర్జున కళ్యాణ్, హిట్ చిత్రాలు చూశాక షాక్ అయ్యాను. ఆ చిత్రాల్లో విశ్వక్ గొప్పగా నటించాడు. అంత సెటిల్డ్ గా నటించడం గొప్ప విషయం. విశ్వక్ ఒక చట్రంలో ఇరుక్కుపోతున్నాడు అనుకున్న సమయంలో ప్రయోగాత్మక చిత్రాలు చేశాడు. నేను కూడా ఒక దశలో ఛట్రంలో ఇరుక్కుపోయాను. తెలుసుకుని బయటకు వచ్చాను. కొత్త చిత్రాలు చేయాలని అనుకున్నాను. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే చిత్రాలు చేస్తానని  వాగ్దానం చేసిన రోజే నేను మళ్ళీ పుట్టాను.

ఇక విశ్వాక్ తనకు తానే ప్రూవ్ చేసుకుందామని బయలు దేరిన నటుడు. దాస్ కా ధమ్కీ బ్లాక్ బస్టర్ కావాలి. విశ్వక్ డైరెక్షన్ ఆపేయాలి. ఎందుకంటే చాలా మంది ప్రతిభ కలిగిన దర్శకులు ఉన్నారు. వాళ్లకు విశ్వక్ సేన్ అవకాశం ఇవ్వాలి.  నాతో విశ్వక్ ఒక మాటన్నాడు. నిజంగా నాకు చాలా బాధేసింది. ఈ సినిమాకు అంత పెట్టేశాను అన్నాడు. సినిమా అంటే ఇంత పిచ్చి ఉన్న వాళ్ళను మనం ప్రోత్సహించాలి. మనం ఆదరించాలి. మన తెలుగు వారి పండగ ఉగాది నాడు దాస్ కా ధమ్కీ విడుదల అవుతుంది. అందరూ చూడాలని ఆశిస్తున్నాను... అంటూ ఎన్టీఆర్ ముగించాడు. 

దాస్ కా ధమ్కీ చిత్రానికి విశ్వక్ సేన్ దర్శకుడు. విశ్వక్ సేన్ కి జంటగా నివేదా పేతురాజ్ నటించారు. గతంలో వీరి కాంబోలో పాగల్ తెరకెక్కింది. ప్రసన్నకుమార్ బెజవాడ స్టోరీ అందించారు. కరాటే రాజు నిర్మించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఉగాది కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. 

click me!