నేను పాడైపోతే చూడాలని చాలా మంది అనుకుంటున్నారు... విశ్వక్ సేన్ సెన్సేషనల్ కామెంట్స్!

By Sambi ReddyFirst Published Mar 17, 2023, 10:28 PM IST
Highlights

విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. హీరో విశ్వక్ సేన్ తన స్పీచ్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. 
 

దాస్ కా ధమ్కీ చిత్రానికి విశ్వక్ సేన్ నటించి దర్శకత్వం వహించారు. మార్చి 22న దాస్ కా ధమ్కీ వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ దాస్ కా ధమ్కీ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  వేదికపై విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మీద ఆయన ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ అన్న ఇంట్లో ఒక విషాదం చోటు చేసుకుంది. ఈ టైం లో ఆయన్ని పిలవడం సబబేనా అన్న సంకోచం ఏర్పడింది. అయినా ఆయనకు చెప్పగానే వస్తాను అన్నారు. ఎన్టీఆర్ నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నారంటే చాలా మంది నమ్మలేదు. ఆయన ఇంటికి వెళితే నన్ను ఎంతగానో ఆదరించారు. భోజనం పెట్టి ఆప్యాయంగా మాట్లాడారు. ఎన్టీఆర్ ఇండియాలోనే బెస్ట్ యాక్టర్. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలిచింది. ఇప్పుడు చూపించింది టీజరే. సినిమా ఇంకా బాకీ ఉంది. 

ఇక దాస్ కా ధమ్కీ గురించి చెప్పాలంటే.. సర్వం ధారపోసి ఈ సినిమా తీశాను. నేను పడిపోతే, పాడైపోతే చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ రాకతో, ఆయన అభిమానుల బ్లెస్సింగ్స్ తో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ స్టార్ట్. దాస్ కా ధమ్కీ చిత్రం ఫస్ట్ హాఫ్ చాలా ఫన్ ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ సైలెంట్ గా ఉత్కంఠతో చూస్తారు. దాస్ కా ధమ్కీ ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది... అంటూ విశ్వక్ సేన్ తన స్పీచ్ ముగించారు. 

విశ్వక్ సేన్ కి జంటగా నివేదా పేతురాజ్ నటించారు. గతంలో వీరి కాంబోలో పాగల్ తెరకెక్కింది. ప్రసన్నకుమార్ బెజవాడ స్టోరీ అందించారు. కరాటే రాజు నిర్మించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఉగాది కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. 
 

click me!