నేచురల్ స్టార్ నాని అంటే మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి మారింది. వరుసగా సినిమాలు ఆగిపోతున్నాయి.
నేచురల్ స్టార్ నాని రేంజ్ ఇటీవల పెరిగింది. `దసరా` చిత్రంతో ఆయన మార్కెట్ మాత్రమే కాదు, ఇమేజ్ కూడా పెరిగిపోయింది. ఈ మూవీ సుమారు వందకోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన `హాయ్ నాన్న` కూడా డివైడ్ టాక్ వచ్చినా దాదాపు 70, 80కోట్లు కలెక్షన్లని రాబట్టింది. దీంతో నాని టైర్ 2 హీరోల్లో టాప్లోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో `సరిపోదా శనివారం` సినిమాలో నటిస్తున్నారు. ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనింగ్ చిత్రాలకు కేరాఫ్గా నిలిచే దర్శకుడు వివేక్ ఆత్రేయ తన రూట్ మార్చి మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్లో రాబోతుంది.
ప్రస్తుతం నాని చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. `బలగం` వేణు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. విలేజ్ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ ఇది.దీంతోపాటు సుజీత్ దర్శకత్వంలో మరో మాఫియా బేస్డ్ మూవీ చేయబోతున్నాడు. అలాగే `దసరా`దర్శకుడితోనూ మరో సినిమా ప్లానింగ్ ఉంది. దీంతోపాటు ఓ కొత్త డైరెక్టర్ తోనూ సినిమా చర్చలు నడిచాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నానికి షాక్ ల మీద షాక్ తగులుతుంది. ఇప్పటికే సుజీత్ మూవీ ఆగిపోయిందని అంటున్నారు. డీవీవీ దానయ్య నిర్మించాల్సిన ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోతున్న నేపథ్యంలో దానయ్య బ్యాక్ అయ్యారట. నాని 30కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నారని, దీని కారణంగా సినిమాకి సుమారు 80కోట్ల బడ్జెట్ అవుతుందని, నానిపై ఇంత బడ్జెట్ కష్టమని భావించిన నిర్మాత వెనక్కి తగ్గాడట. దీంతో ఈ సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయిందని అంటున్నారు.
ఇప్పుడు మరో షాక్ తగిలింది. మరో సినిమా కూడా ఆగిపోయిందంటూ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. `బలగం` సినిమాతో ట్రెండ్ మార్చేసిన వేణు యెల్దండి దర్శకత్వంలో నాని ఓ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. దిల్ రాజు ఈ మూవీని నిర్మించబోతున్నారు. తాజాగా ఈ సినిమా కూడా క్యాన్సిల్ అయ్యిందట. స్టోరీ నచ్చక పక్కనపెట్టారట నాని. దీంతో దిల్రాజు కూడా వద్దు అనే నిర్ణయానికి వచ్చారట. అయితే మరేదైనా కొత్తకథ వస్తే ఈ కాంబినేషన్లో మూవీఉంటుందని, లేదంటే ఇక పూర్తిగా క్యాన్సిల్ కాబోతుందని తెలుస్తుంది. ఇలా వరుసగా నాని సినిమాలు ఆగిపోవడం అభిమానులను కలవరానికి గురిచేస్తున్నాయి. మరి ఈ విషయంలో నాని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.