'యువరాణి మీ ఆజ్ఞను పాటించాను' త్రిషను ఉద్దేశిస్తూ కార్తీ ట్వీట్... విషయం ఏమిటంటే!

By team teluguFirst Published Sep 19, 2021, 11:23 AM IST
Highlights

గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ టైటిల్ తో భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్, కార్తీ వంటి స్టార్స్ నటిస్తున్నారు. 
 

హీరో కార్తీక్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. హీరోయిన్ త్రిషను యువరాణి అంటూ కామెంట్ చేశారు. కార్తీ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. విషయంలోకి వెళితే గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ టైటిల్ తో భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్, కార్తీ వంటి స్టార్స్ నటిస్తున్నారు. 


రెండు భాగాలుగా విడుదల కానున్న పొన్నియిన్ సెల్వన్ పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల కానుంది. మొదటి పార్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో సమ్మర్ కానుకగా 2022 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నారు. కాగా... హీరో కార్తీ పొన్నియిన్ సెల్వన్ మొదటి పార్ట్ తన వంతు షూటింగ్ పూర్తి చేశారు. ఇదే విషయాన్ని, ఆ చిత్రంలోని పాత్రల ఆధారంగా కార్తీ ట్వీట్ చేశాడు. 


యువ రాణి త్రిష మీ ఆజ్ఞ పాటించాను, యువ రాజ జయం రవి... నా పని పూర్తి చేశాను... అంటూ ట్వీట్ చేశారు. ఇక పొన్నియిన్ సెల్వన్ మూవీలో త్రిష, జయం రవి యువరాణి, యువరాజు గా కనిపించనున్నారని కార్తీ ట్వీట్ ద్వారా అర్థం అవుతుంది. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. 
ఇటీవల మధ్య ప్రదేశ్ లో పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ జరిపారు. హీరోయిన్ ఐశ్వర్య రాయ్ పై ఓ భారీ సాంగ్ షూట్ చేయగా, దాదాపు 400మంది డాన్సర్స్ పాల్గొన్నారట. దేశవ్యాప్తంగా ఈ మూవీపై అంచనాలు నెలకొని ఉన్నాయి. 
 

இளவரசி , நீங்கள் இட்ட ஆணை நிறைவேற்றப்பட்டது.

இளவரசேசசசசச , என் பணியும் முடிந்தது!

— Actor Karthi (@Karthi_Offl)
click me!