హనుమాన్ మూవీ దర్శకుడు.. ప్రశాంత్ వర్మ ఇట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. తన ఆఫీస్ కు ఏకంగా ఆంజయేయుడు వచ్చాడంటూ.. ప్రశాంత్ వర్మ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ ఆఫీస్ కు ఆంజనేయుడు రావడం ఏంటీ... ?
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకన్నాడు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాలు చేస్తూ వస్తున్నా..మంచి సినిమాలు.. క్వాలిటీ కథలను ఆడియన్స్ కు అందిస్తున్నాడు. ఈప్రయత్నంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా..కొన్నిసార్లు మాత్రం మంచి రిజల్ట్స్ అందుకుంటున్నాడు. తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా హనుమాన్. యంగ్ స్టార్ తేజ సజ్జా హీరోగా నటించిన ఈసినిమా మొదటి నుంచి చెపుతున్నట్టే.. సూపర్ సక్సెస్ ను సాధించడంతో పాటు.. పెద్ద పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టేసింది.
థియేటర్ల విషయంలో ఇబ్బందులు పడుతూ.. పెద్ద సినిమాల మధ్య నలిగిపోతూ.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈమూవీ.. కంటెంట్ ఉంటే కటౌట్లతో పనిలేదు అని నిరూపించింది. కథలో పస ఉంటే...పెద్ద సినిమాలు ఎన్ని ఎదురొచ్చినా.. తిరుగుండదని హనుమాన్ సినిమా నిరూపించింది. పాన్ ఇండియా మూవీగా.. . దేశవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది. దీంతో మూవీ లవర్స్ కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఆపోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే.. తన ఆఫీస్ కు ఎవరో స్పెషల్ గెస్ట్ వచ్చారని పోస్ట్ పెట్టారు. ఆయన ఇంటికి ఆంజనేయుడువచ్చాడు.. అవును.. ప్రశాంత్ వర్మ పెట్టినపోస్ట్ లో.. ఆయన ఆఫీస్ గోడపై ఓ కోతి ప్రశంతంగా కూర్చొని ఉంది. ఇక ఈ సినిమాలో కోటి అనే కోతి పాత్ర ఉన్న విషయం తెలిసిందే. ఈ పాత్రకు టాలీవుడ్ నటుడు మాస్ మహారాజా రవితేజ డబ్బింగ్ చెప్పడంతో ఫుల్ వైరల్ అయ్యింది. ఇక ఈ సినిమా చూసిన వారు కోతి పాత్ర బాగుందని.. హీరో లాగానే.. కోటికి కూడా మాస్ ఎలివేషన్స్ ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు.
Look who’s come to my office! 😊 pic.twitter.com/lLbIYJaIlW
— Prasanth Varma (@PrasanthVarma)అయితే తాజాగా తన ఆఫీస్ పైకప్పు మీద ఎవరు వచ్చారో చుడండి అంటూ కోతి ఉన్న ఫొటోను ప్రశాంత్ వర్మ పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు కోటి వచ్చాడు, కోటి అన్న మాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక హనుమాన్ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కే నిరంజన్ రెడ్డి తెరకెక్కించగా.. తమిళ బ్యూటీ అమృతా అయ్యర్.. తేజ్ సర్జకుజంటగా నటించి మెప్పించింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ లాంటి నటులు కీలక పాత్రలు పోషించారు. అయితే గతంలోనే తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో జాంబిరెడ్డి సినిమా వచ్చింది. ఆ మూవీ తరువాత లాంగ్ గ్యాప్ లో ఈసినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకోచ్చారు.