ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ వరుసగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్, ఎక్స్ పర్మెంట్ మూవీస్ చేస్తుంది. ఇప్పుడు మరో ప్రయోగాత్మక మూవీతో రాబోతుంది.
ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని కమర్షియల్ సినిమాల కంటే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ప్రయారిటీ ఇస్తుంది. కంటెంట్ ఉన్న చిత్రాలతో అలరిస్తుంది. ఇటీవల ఆమె `మై నేమ్ ఈజ్ శృతి` చిత్రంతో మెప్పించింది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో ఆమె మెయిన్ లీడ్గా మెరిసింది. ఆద్యంతం ఆకట్టుకుంది. కానీ సినిమా పెద్దగా ఆడలేదు. తాజాగా ఆమె మరో ప్రయోగాత్మక చిత్రంతో వస్తుంది. ఇప్పుడు తెలుగులో `105 మినిట్స్` అనే చిత్రంలో నటించింది.
తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి ఈ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో గ్లాస్ అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. హన్సిక రక్తపు మరకలతో ఉంది. ఓ లుక్లో ఆమె కాళ్లకి చేతులకు, మెడకు గొలుసుతో కట్టేసి ఉంది. మరో లుక్లో జైల్ సెల్లో కాళ్లకి గొలుసులతో ఉంది. ఓ చోట భయపడుతూ, మరో చోట భయపెడుతూ కనిపిస్తుంది. మొత్తంగా ఇదొక హర్రర్ మూవీ అని అర్థమవుతుంది. పోస్టర్లు ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి.
అయితే ఇది 105 మినిట్స్ నాన్ స్టాప్గా తెరకెక్కించిన మూవీ అని తెలుస్తుంది. ఇది ప్రయోగాత్మకంగా చిత్రమని, 105 మినిట్స్ గ్యాప్ లేకుండా సింగిల్ షాట్లో చిత్రీకరిస్తున్నట్టు, ఒకే టేక్లో తీస్తున్నట్టు టీమ్ తెలిపారు. కానీ మధ్యలో సినిమాకి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ రిలీజ్కి రెడీ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలు షురూచేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి రాజు దుస్స దర్శకత్వం వహించగా, రుంద్రాంశ్ సెల్యులాయిడ్స్, మాంక్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బొమ్మ కె శివ నిర్మాత.
ఇక తాజాగా సినిమా గురించి టీమ్ చెబుతూ, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ మూవీ గా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. మోషన్ పోస్టర్లో రక్తపు గాయాలతో కుర్చీలో కూర్చున్న హన్సిక ఒక ఇంటెన్సిఫైడ్ లుక్ తో కనిపిస్తుంది. శ్యాం సి యస్ సంగీతాన్ని అందించారు. రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ మూవీ పైన అంచనాలను పెంచేస్తోంది. హన్సిక ఇంతకుముందు ఎన్నడు కనిపించని గెటప్ లో చాలా కొత్తగా కనిపిస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ రోల్ అందులోనూ ఇలాంటి ఒక డిఫరెంట్ రోల్ చేయడం హన్సిక కి ఇదే మొదటిసారి. మాంక్ మరియు పనోరమ స్టూడియోస్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది` అని తెలిపింది. ఈ సినిమాకి డి ఓ పి కిషోర్ బోయిదాపు, సంగీతం: సామ్ సిఎస్.