ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణకి మాతృవియోగం..

By tirumala ANFirst Published May 30, 2024, 4:51 PM IST
Highlights

ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) గారి మాతృమూర్తి శ్రీమతి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) గురువారం (30-5-24) 3 గంటల ప్రాంతంలో హృదయ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. 

ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) గారి మాతృమూర్తి శ్రీమతి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) గురువారం (30-5-24) 3 గంటల ప్రాంతంలో హృదయ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. ఆవిడకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు సంతానం. 

రాధాకృష్ణ గారు ఆవిడకు రెండవ తనయుడు. యువ నిర్మాత నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కి  నాగేంద్రమ్మ నాయనమ్మ అవుతారు.  రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఫిల్మ్ నగర్ లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Latest Videos

హారిక అండ్ హాసిని ఫిలిమ్స్ సంస్థని స్థాపించిన రాధాకృష్ణ ఎక్కువగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు చేస్తున్నారు. ఈ బ్యానర్ లో అ..ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠ పురములో, గుంటూరు కారం లాంటి చిత్రాలని నిర్మించారు. 

మరోవైపు రాధాకృష్ణ అన్న కొడుకు యువ నిర్మాత నాగవంశీ తన బాబాయ్ పర్యవేక్షణలో పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. నాగవంశీ నిర్మించిన విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం మరికొన్ని గంటల్లో మే 31న రిలీజ్ అవుతోంది. ఈ సమయంలో వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. 

click me!