గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సెన్సార్ పూర్తి.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!

By team teluguFirst Published Jun 28, 2022, 3:20 PM IST
Highlights

గోపీచంద్ - రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. దర్శకుడు మారుతీ డైరెక్ట్ చేశారు. రెండు రోజుల్లో రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.
 

గోపీచంద్‌(Gopichand) ఇటీవల `సీటీమార్‌` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న మారుతి దర్శకత్వంలో గోపీచంద్‌ `పక్కా కమర్షియల్‌`(pakka Commercial)లో నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna), పలు కీలక పాత్రల్లో స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు నటించారు. జూలై 1న రిలీజ్ కానున్న ఈ మూవీని అల్లు అరవింద్  స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి బ‌న్నీ వాసు నిర్మాత‌గా తెరకెక్కుతుంది. 

చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని హైటెక్  సిటీలో గల శిల్పా కళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ పక్కా కమర్షియల్ మెగా మ్యాచో ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్ట్ గా హాజరై చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. మరింత  రీచ్ పెరిగేలా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది యూనిట్.

తాజాగా పక్కా కమర్షియల్ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.  ఈ చిత్రం 2 గంటల 32 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించడానికి అన్ని విధాలా సిద్ధమైంది. ఇప్పటికే చిత్రంలోని పాటలు, ట్రైలర్ ఆడియెన్స్ కు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. మరోవైపు టైటిల్ కు కూడా ఇండస్ట్రీల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

 

Gets U/A

Runtime: 2 hrs 32mins pic.twitter.com/Gy4JZVTF5Y

— T2BLive.COM (@T2BLive)
click me!