నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘దసరా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతోందంటే?

By team teluguFirst Published Aug 26, 2022, 12:01 PM IST
Highlights

నేచురల్ స్టార్ నాని (Nani) అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘దసరా’ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. 
 

విభిన్న కథలతో నేచురల్ స్టార్ నాని (Nani) తన అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే ‘శ్యామ్ సింగరాయ్’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్.. రీసెంట్ గా ‘అంటే సుందరానికీ’తో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘దసరా’ (Dasara) కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి. సరికొత్త కథతో నాని తన అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్టు గత అప్డేట్స్ ద్వారా అర్థమవుతోంది. 

నాని ఈ చిత్రంలో ఊరమాస్ లుక్ లో కనిపించనున్నారు. మునుపెన్నడూ కనిపించని ఆహార్యంతో వస్తున్నారు.  దీంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ‘దసరా’ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. 2023 మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు. తెలుగు భాషతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాని కూడా అనౌన్స్ మెంట్ పోస్టర్ ను పోస్ట్ చేస్తూ ‘ఎట్లతే గట్లాయె వచ్చే ఏడాది మార్చి 30న  సుసుకుందాం.. ఈ సినిమా చాలా కాలం గుర్తుండి పోతుంది’ అంటూ ట్వీట్ చేశాడు. నాని ఇస్తున్న భరోసాకు అభిమానులు ఆనందం వ్యక్తంగా చేస్తున్నారు.

నాని కేరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా ఫిల్మ్ గా  ‘దసరా’ రిలీజ్ కాబోతోంది. దీంతో నాని ఈ చిత్రంపై మరింత ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ ను గోదావరి మైన్స్, పరిసర ప్రాంతాల్లోని పల్లెటూరి గ్రామాల్లో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అలాగే సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ను కూడా యూనిట్ నెక్ట్స్ లెవల్ లో షూట్ చేస్తున్నట్టు  సమాచారం. ఊరమాస్ లుక్ లో నాని వెండితెరపై అదరగొట్టనున్నాడు.  ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి కావస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిగా కల్లా చిత్రీకరణ పూర్తయ్యి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నారు. 

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.  నాని - హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) రెండోసారి జంటగా నటిస్తున్నారు. గోదావరిఖని మైన్స్ బ్యాక్ డ్రాప్ లో చిత్రం తెరకెక్కుతున్నట్టు సమాచారం. నాని కేరీర్ లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో పక్కా కమర్షియల్ హిట్ ఫార్మూలాతో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. 

 

MARCH 30TH WORLDWIDE 🔥

This one will be remembered for a long time🖤

Telugu - Tamil - Malayalam - Kannada - Hindi pic.twitter.com/70PuwsnIhq

— Nani (@NameisNani)
click me!