మాజీ మిస్‌ ఇండియా వరల్డ్ కి కరోనా..

By Aithagoni RajuFirst Published Aug 9, 2020, 9:05 PM IST
Highlights

మరోమాజీ విశ్వ సుందరికి కరోనా సోకింది. మాజీ మిస్ ఇండియా వరల్డ్, ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తున్న నటాషా సూరికి కరోనా సోకింది. ఆరు రోజుల క్రింద అర్జెంట్ పని మీద పుణె వెళ్లాను. అక్కడ్నుంచి ఇంటికొచ్చిన వెంటనే జ్వరం వచ్చింది. 

కరోనా సినీ సెలబ్రిటీలను వెంటాడుతుంది. ఇప్పటికే చాలా మంది తారలు వైరస్‌కి గురయ్యారు. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కుటుంబం అభిషేక్‌ బచ్చన్‌, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్‌, ఆరాధ్య, అనుపమ్‌ ఖేర్‌, నవనీత్‌ కౌర్‌, అలాగే తెలుగులో రాజమౌళి కుటుంబం, దర్శకుడు తేజ, డివివి దానయ్య, బండ్ల గణేష్‌, సింగర్‌ స్మిత వంటి వారికి వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. వీరిలో దాదాపు అందరూ కోలుకున్నారు. 

ఈ క్రమంలో మరోమాజీ విశ్వ సుందరికి కరోనా సోకింది. మాజీ మిస్ ఇండియా వరల్డ్, ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తున్న నటాషా సూరికి కరోనా సోకింది. ఆరు రోజుల క్రింద అర్జెంట్ పని మీద పుణె వెళ్లాను. అక్కడ్నుంచి ఇంటికొచ్చిన వెంటనే జ్వరం వచ్చింది. గొంతు నొప్పి, వీక్ నెస్ కూడా ఆవహించింది. అనుమానం వచ్చి మూడు రోజుల కిందట టెస్ట్ చేయించుకున్నాను. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయాను. నాకు ఇప్పటికీ జ్వరం, నీరసం ఉన్నాయి` అని తనకు కరోనా సోకిన విషయాన్ని నటాషా సూరి ప్రకటించింది. 

ప్రస్తుతం తను తన అమ్మమ్మ, చెల్లెలితో కలిసి ఉంటోంది. కాబట్టి వాళ్లకు కూడా పరీక్షలు చేయించానని చెప్పుకొచ్చింది. వైద్యుల సలహా మేరకు మందులు, ఇమ్యూనిటీ బూస్టర్లు తీసుకుంటున్నానని తెలిపిందీ మాజీ అందాల సుందరి. ముంబయికి చెందిన ఈ సెక్సీ భామ 2005లో నేవీ క్వీన్‌గా, మిస్‌ మహారాష్ట్ర విన్నర్‌గా నిలిచింది. 2006లో మిస్‌ ఇండియా వరల్డ్ విన్నర్‌గా నిలిచింది. అలాగే మిస్‌ వరల్డ్ సెమిఫైనల్‌ వరకు వెళ్ళింది. 

2016లో మలయాళ చిత్రం `కింగ్‌ లియర్‌` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు, హిందీలో `బా బా బ్లాక్‌ షీప్‌`, `వర్జిన్‌ భనుప్రియా` చిత్రాల్లో నటించింది. ఇక ఆమె నటించిన హిందీ చిత్రం 'డేంజరస్' ఈ నెల 14ఓటీటీలో విడుదల కాబోతుంది. ఇందులో కరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా బసు కీలక పాత్రలు పోషించారు. 

click me!