తడబాటు.. బోనీకపూర్ పాస్ పోర్ట్ సీజ్ చేసిన దుబయి పోలీసులు

First Published Feb 26, 2018, 9:17 PM IST
Highlights
  • శ్రీదేవి హఠాన్మరణంపై దుబయి ప్రాసిక్యూషన్ విచారణ
  • కుటుంబసభ్యులను, హోటల్ సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు
  • విచారణలో బోనీకపూర్ తడబాటుతో పాస్ పోర్ట్ సీజ్ చేసిన దుబయి అధికారులు

ప్రస్థుతం శ్రీదేవిది సహజ మరణమా, గుండెపోటుతో చనిపోయిందా లేక, టబ్ లో మునిగి చనిపోయిందా... మునిగి చనిపోతే అదెలా సాధ్యం, లేక ఏదైనా కుట్ర కోణం దాగి వుందా అనే అంశాలపై దుబయి పోలీసులు విచారిస్తున్నారు. దుబయి ప్రాసిక్యూషన్ అభ్యంతరంతో... డెత్ సర్టిఫికెట్  జారీ చేసినా.. దాంట్లో ప్రమాదవశాత్తు టబ్ లో మునిగి చనిపోయినట్లు పేర్కొన్నా, గుండెపోటు అని ప్రస్తావించకకపోవటంతో అనుమానాలు బలపడ్డాయి. దీంతో విచారణ నిమిత్తం పోలీసులు బోనీకపూర్ సహా హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాక బోనీ కపూర్ పాస్ పోర్ట్ కూడా సీజ్ చేశారు దుబయి పోలీసులు.

 

అందాల తార శ్రీదేవి దుబయిలోని జుమైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ గదిలో హఠాన్మరణం పాలైన సంగతి తెలిసిందే. అయితే దుబయి సర్కారు ఆరోగ్య శాఖ ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించిందని నివేదిక ఇచ్చింది. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం ఆరోగ్యవంతమైన మహిళ టబ్ లో మునిగి చనిపోవటమేంటని, దాన్ని అధికారికంగా ఎలా నిర్థారించారని ప్రాసిక్యూషన్ వారు ప్రశ్నిస్తున్నారు.

 

ముందు గుండెపోటుతో చనిపోయిందంటూ చెప్పిన కుటుంబ సభ్యులు ఇప్పుడు రిపోర్టులో ఆల్కహాల్ వుందంటూ రావటం, టబ్ లో ప్రమాదవశాత్తు మునిగిపోయిందంటూ రిపోర్ట్ రావటం ఇలా... రకరకాల కోణాల్లో ప్రశ్నలు తలెత్తుతుండటంతో కేసు విచారణ తీవ్రమైంది.

 

శ్రీదేవిది ప్రమాదమా... ఆత్మ హత్యా.. లేక కుట్ర కోణమా అనేది అర్థం కాని సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో విచారణ ముమ్మరమైంది. భారతీయ సినీ పరిశ్రమల వర్గాలను, దేశంలోని కోట్లాది మంది అభిమానులను తొలుస్తున్న శ్రీదేవి మృతి ప్రశ్న ఇప్పుడు ఇలా ట్విస్ట్ లు ఇస్తుండటం ఉత్కంఠ రేపుతోంది. 

 

శ్రీదేవి మృతి కేసును సీరియస్ గా తీసుకున్న దుబయి ప్రాసిక్యూషన్ కేసు విచారణ ముమ్మరం చేసింది. విచారణ పూర్తయే వరకు బోనీ కపూర్ దుబయి విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. ప్రస్థుతం పోలీసుల అదుపులో బోనీకపూర్ తోపాటు హోటల్ సిబ్బంది కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.

అయితే విచారణలో బోనీ చెప్తున్న సమాధానాలు పొంతన లేకుండా వుండటంతో పోలీసులు కేసు తేలేవరకు దుబయి విడిచి వెళ్లరాదని బోనీకపూర్ ను ఆదేశించారు. అదేవిధంగా బోనీకపూర్ పాస్ పోర్ట్ ను కూడా సీజ్ చేశారు పోలీసులు.

click me!